Dadisetti Raja: ప్రజా గర్జనను డైవర్ట్ చేయడానికే పవన్ ఉత్తరాంధ్ర టూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dadisetti Raja: ఈనెల 15 నుంచి ఉత్తరాంధ్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్న నేపథ్యంలో వైసీపీ నేతలు విమర్శలు చేశారు. కాకినాడలో మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ప్రజాగర్జన డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని.. వారిలో ఒక్కరు గెలిచినా వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. అమరావతి పేరు చెప్పి తన బినామీలతో లక్షల కోట్లు దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రణాళికలో భాగంగానే రథయాత్రలు, పాదయాత్రలు చేస్తున్నారని.. పవన్ అహంకారంతో మాట్లాడుతున్నారని.. ఐదు కోట్ల మందికి వారి భావనను తెలియపరచుకునే హక్కు లేదా అని మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. ప్యాకేజీ తీసుకుని ఆయన మాత్రమే బాగుంటే సరిపోతుందా అని నిలదీశారు. ప్రజలు పవన్ డైవర్షన్ పాలిటిక్స్ గమనిస్తున్నారని తెలిపారు. దేశ చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటి చెప్పు దెబ్బ లాంటి తీర్పు పవన్కు ఇచ్చారని.. అయినా సిగ్గులేకుండా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ప్రవచనాలు చెప్తున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు.
Read Also: AP High Court: మేము కూడా ‘బిగ్బాస్’ చూస్తాం.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Also Read
- Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
- AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
మరోవైపు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్పై విమర్శలు చేశారు. విశాఖలో పవన్ కళ్యాణ్ జనవాణి వాయిదా వేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టిని మళ్లించే చర్యలు మానుకోవాలని హితవు పలికారు.గాజువాకలో ఓడిపోయినా రెండో స్థానం కల్పించిన ఈ ప్రాంతంలోని ఓటర్ల మనోభావాన్ని పవన్ గుర్తించాలన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఆకాంక్షించే రాజకీయ పార్టీలన్నీ ఉమ్మడి వేదికపైకి రావాలని అవంతి శ్రీనివాస్ తెలిపారు. వికేంద్రీకరణ పోరాటాన్ని లీడ్ తీసుకుంటామని ఏ రాజకీయ పార్టీ ముందుకు వచ్చినా పక్కకు తప్పుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉందన్నారు. వికేంద్రీకరణ ఉద్యమం ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం పోరాటం అని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!