Dadisetti Raja: ప్రజా గర్జనను డైవర్ట్ చేయడానికే పవన్ ఉత్తరాంధ్ర టూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dadisetti Raja: ఈనెల 15 నుంచి ఉత్తరాంధ్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్న నేపథ్యంలో వైసీపీ నేతలు విమర్శలు చేశారు. కాకినాడలో మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ప్రజాగర్జన డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని.. వారిలో ఒక్కరు గెలిచినా వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. అమరావతి పేరు చెప్పి తన బినామీలతో లక్షల కోట్లు దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రణాళికలో భాగంగానే రథయాత్రలు, పాదయాత్రలు చేస్తున్నారని.. పవన్ అహంకారంతో మాట్లాడుతున్నారని.. ఐదు కోట్ల మందికి వారి భావనను తెలియపరచుకునే హక్కు లేదా అని మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. ప్యాకేజీ తీసుకుని ఆయన మాత్రమే బాగుంటే సరిపోతుందా అని నిలదీశారు. ప్రజలు పవన్ డైవర్షన్ పాలిటిక్స్ గమనిస్తున్నారని తెలిపారు. దేశ చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటి చెప్పు దెబ్బ లాంటి తీర్పు పవన్కు ఇచ్చారని.. అయినా సిగ్గులేకుండా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ప్రవచనాలు చెప్తున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు.
Read Also: AP High Court: మేము కూడా ‘బిగ్బాస్’ చూస్తాం.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Also Read
- Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
- CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం 'సంజీవని'.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
- Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
మరోవైపు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్పై విమర్శలు చేశారు. విశాఖలో పవన్ కళ్యాణ్ జనవాణి వాయిదా వేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టిని మళ్లించే చర్యలు మానుకోవాలని హితవు పలికారు.గాజువాకలో ఓడిపోయినా రెండో స్థానం కల్పించిన ఈ ప్రాంతంలోని ఓటర్ల మనోభావాన్ని పవన్ గుర్తించాలన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఆకాంక్షించే రాజకీయ పార్టీలన్నీ ఉమ్మడి వేదికపైకి రావాలని అవంతి శ్రీనివాస్ తెలిపారు. వికేంద్రీకరణ పోరాటాన్ని లీడ్ తీసుకుంటామని ఏ రాజకీయ పార్టీ ముందుకు వచ్చినా పక్కకు తప్పుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉందన్నారు. వికేంద్రీకరణ ఉద్యమం ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం పోరాటం అని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
-
Sonam Wangchuk: “నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా”.. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
ట్రెండింగ్
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!