CM Jagan: ఆనాడు నన్ను టార్గెట్ చేసిన పార్టీ ఈరోజు నామరూపాల్లేకుండా పోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీపై వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఓదార్పు యాత్ర చేయవద్దన్న పార్టీని తాను వ్యతిరేకించినందుకు తనపై అక్రమ కేసులు పెట్టారని జగన్ ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దేశంలోని శక్తివంతమైన వ్యవస్థలను తనపై ఉసిగొల్పాయని.. అన్యాయమైన ఆరోపణలు చేయించి కేసులు పెట్టించి అరెస్ట్ చేయించారన్నారు. ఆనాడు వాళ్లకు లొంగిపోయి ఉంటే ఈనాడు జగన్ మీ ముందు ఇలా ఉండేవాడు కాదని వ్యాఖ్యానించారు. తనను టార్గెట్ చేసిన పార్టీ ఈరోజు నామరూపాల్లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి జగన్ మండిపడ్డారు. గతంలో ఎన్నికల తర్వాత టీడీపీ మేనిఫెస్టో కనిపించకుండా చేశారని.. కానీ తాము పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నామని.. జగన్ చెప్పింది నిజమని నమ్మితేనే వచ్చే ఎన్నికల్లో ఓటేయాలని ప్లీనరీ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో సెల్ఫోన్ లైట్లతో ఆపరేషన్లు చేసిన ఘటనలు చూశామని.. ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలు కొరికిన ఘటనలు చూశామని.. తాము నాడు-నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చామని జగన్ తెలిపారు.
Read Also: Y. S. Sharmila : కాంగ్రెస్, షర్మిల పార్టీ పొత్తు? సమీకరణాలు మారుతున్నాయా..? |
Also Read
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
ఆనాడు ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు 151కి, ఒక్క ఎంపీతో ప్రారంభమైన ప్రయాణం 22కి చేరిందని సీఎం జగన్ అన్నారు. 2014 ఎన్నికల్లో 1 శాతం ఓట్ల తేడాతో అధికారం కోల్పోయామని చెప్పారు. అప్పుడు తమ 23 మంది ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా టీడీపీ కొనుగోలు చేసిందని, 2019లో ఆ పార్టీకి అవే సంఖ్యలో సీట్లు వచ్చాయని తెలిపారు. టీడీపీ లాగా తాను ఎమ్మెల్యేలను కొనడంపై దృష్టి పెట్టలేదని, తన ఫోకస్ అంతా ప్రజల మంచి కోసమేనని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు పిల్లలు, మనవళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారని.. పేదలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలనడం విడ్డూరమని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు ఎదగకూడదన్నదే చంద్రబాబు విధానమని ఆరోపించారు. నారాయణ, చైతన్య స్కూళ్ల కోసం చంద్రబాబు శ్రమిస్తారని.. ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లడం కోసం తాము శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. ఒక్క విద్యా రంగంలో 9 పథకాలను అమలు చేశామని.. అమ్మఒడి ద్వారా ఇప్పటివరకు రూ.19,617 కోట్లు ఇచ్చామని జగన్ వెల్లడించారు.
తాజావార్తలు
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!