Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Botsa Sensational Comments On Atchennaidu

అచ్చెన్నాయుడు నిజం మాట్లాడాడు.. బొత్సా ఆసక్తికర వ్యాఖ్యలు !

Published Date :April 13, 2021 , 7:32 pm
By Premchand Chowdary
అచ్చెన్నాయుడు నిజం మాట్లాడాడు.. బొత్సా ఆసక్తికర వ్యాఖ్యలు !
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు లోకేష్ ను తిడుతున్నట్టుగా ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పార్టీ క్యాడర్‌ను చంద్రబాబు, లోకేష్‌ వాడుకుని వదిలేస్తున్నారని ఒక టీడీపీ నేత.. అచ్చెన్నాయుడు వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. తనకు పార్టీలో జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తూ.. ‘ఆయనే సరిగా ఉంటే పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం ‘పార్టీ లేదు.. ఏమీ లేదు’ అంటూ టీడీపీ నేతకు వత్తాసు పలికారు. అయితే ఇది లోకేష్ ను ఉద్దేశించి అన్నదేనని ప్రచారం చేస్తున్నారు అధికార పక్ష కార్యకర్తలు. 

అయితే ఈ వీడియో పై అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. టీడీపీ యువ నాయకుడు లోకేష్‌తో తనకున్న అనుబంధాన్ని విడ‌దీయ‌లేవని వైఎస్ జగన్‌పై అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికలో అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఐకమత్యంతో పనిచేస్తున్నామని, జగన్‌కు ఓట‌మి భ‌యం పట్టుకుందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇక ఈ అంశం మీద మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు లోకేష్ గురించి నిజం మాట్లాడాడన్న ఆయన రోజు మేము మీడియా ముందు మాట్లాడేది నాలుగు గోడల మధ్య చెప్పారని అన్నారు. అచ్చెన్నాయుడు మీడియా ముందు మాట్లాడలేడు కాబట్టి టీడీపీ నాయకుడుతో మాట్లాడారని అన్నారు. అచ్చెన్నాయుడు చెప్పింది నేనైతే నిజమే అనుకుంటున్నానని అన్నారు. 

Also Read

  • AP SSC Results 2026: ఏపీ టెన్త్‌ ఫలితాలు విడుదల.. పెరిగిన ఉత్తీర్ణత..
  • SRM University Harassment Case: ఎస్ఆర్‌ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఫిర్యాదుతో..
  • AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్‌ ఫలితాలు.. ఇలా చెక్‌ చేయండి..
  • AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అజెండా..

చంద్రబాబు జిమ్మిక్కులు 

తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చంద్రబాబు అనేక జిమ్మిక్కులు చేస్తున్నారన్న బొత్స రాళ్ళ దాడి చేశారని కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. టీడీపీకి డిపాజిట్ దక్కదని ముందుగానే చంద్రబాబు ఊహించారని అన్నారు. అందుకే రాళ్ల దాడి డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. బీజేపీ, టీడీపీ చీకటి ఒప్పందంతో పని చేస్తున్నాయని, బీజేపీతో ఉంటే తన పరిస్థితి సున్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ కోరంటైన్ కి వెళ్ళిపోయారని విమర్శించారు. ఉప ఎన్నికలో 85 శాతం ఓట్లు వైసిపీకి వస్తాయన్న ఆయన వేల మందిలో ఒక రాయి ఎలా కనిపిస్తుంది ? పోలీసులు విచారణలో రాళ్ళ దాడి జరిగిన ఆధారాలు లేవని చెబుతున్నారని అన్నారు. గెలుపు ఓటములు పక్కన పెట్టిన చంద్రబాబు ఎన్నికల్లో ధైర్యంగా పోరాడాలన్న ఆయన చంద్రబాబు ధైర్యం ఉంటే తిరుపతి చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పాలన్నారు. చంద్రబాబు నాయుడు తోక ప్రజలు ఎప్పుడో కత్తిరించారని అన్నారు. 

సంక్షేమ పాలన ఎక్కడైనా ఉందా..?

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలన ఎక్కడైనా ఉందా..? సీఎం జగన్మోహన్ రెడ్డి కంటే బాగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిపాలన చేస్తున్నమని బీజేపీ నాయకులు చెప్పగలరా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మాయలు ఇక పని చేయవని చంద్రబాబు నాయుడితో ప్రజలు విసిగిపోయారని అన్నారు. 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • achhennaidu
  • botsa
  • corona
  • tdp
  • viral vedio

తాజావార్తలు

  • Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్

  • Bhoghi : ‘కందుల సులోచన రాణి’గా.. అనుపమ.. ఫస్ట్ లుక్ బాగుంది

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Jasprit Bumrah: సీన్ రివర్స్.. బ్యాటర్ల ముందు బెంబేలెత్తిపోతున్న బుమ్రా.. కెరీర్లోనే చెత్త ప్రదర్శన!

  • Dhruva Natchathiram : విక్రమ్ సినిమా వస్తోంది.. కానీ సూర్యతో పోటీ తప్పేలా లేదు

ట్రెండింగ్‌

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions