అచ్చెన్నాయుడు నిజం మాట్లాడాడు.. బొత్సా ఆసక్తికర వ్యాఖ్యలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు లోకేష్ ను తిడుతున్నట్టుగా ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పార్టీ క్యాడర్ను చంద్రబాబు, లోకేష్ వాడుకుని వదిలేస్తున్నారని ఒక టీడీపీ నేత.. అచ్చెన్నాయుడు వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. తనకు పార్టీలో జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తూ.. ‘ఆయనే సరిగా ఉంటే పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం ‘పార్టీ లేదు.. ఏమీ లేదు’ అంటూ టీడీపీ నేతకు వత్తాసు పలికారు. అయితే ఇది లోకేష్ ను ఉద్దేశించి అన్నదేనని ప్రచారం చేస్తున్నారు అధికార పక్ష కార్యకర్తలు.
అయితే ఈ వీడియో పై అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. టీడీపీ యువ నాయకుడు లోకేష్తో తనకున్న అనుబంధాన్ని విడదీయలేవని వైఎస్ జగన్పై అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికలో అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఐకమత్యంతో పనిచేస్తున్నామని, జగన్కు ఓటమి భయం పట్టుకుందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇక ఈ అంశం మీద మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు లోకేష్ గురించి నిజం మాట్లాడాడన్న ఆయన రోజు మేము మీడియా ముందు మాట్లాడేది నాలుగు గోడల మధ్య చెప్పారని అన్నారు. అచ్చెన్నాయుడు మీడియా ముందు మాట్లాడలేడు కాబట్టి టీడీపీ నాయకుడుతో మాట్లాడారని అన్నారు. అచ్చెన్నాయుడు చెప్పింది నేనైతే నిజమే అనుకుంటున్నానని అన్నారు.
Also Read
- Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
చంద్రబాబు జిమ్మిక్కులు
తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చంద్రబాబు అనేక జిమ్మిక్కులు చేస్తున్నారన్న బొత్స రాళ్ళ దాడి చేశారని కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. టీడీపీకి డిపాజిట్ దక్కదని ముందుగానే చంద్రబాబు ఊహించారని అన్నారు. అందుకే రాళ్ల దాడి డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. బీజేపీ, టీడీపీ చీకటి ఒప్పందంతో పని చేస్తున్నాయని, బీజేపీతో ఉంటే తన పరిస్థితి సున్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ కోరంటైన్ కి వెళ్ళిపోయారని విమర్శించారు. ఉప ఎన్నికలో 85 శాతం ఓట్లు వైసిపీకి వస్తాయన్న ఆయన వేల మందిలో ఒక రాయి ఎలా కనిపిస్తుంది ? పోలీసులు విచారణలో రాళ్ళ దాడి జరిగిన ఆధారాలు లేవని చెబుతున్నారని అన్నారు. గెలుపు ఓటములు పక్కన పెట్టిన చంద్రబాబు ఎన్నికల్లో ధైర్యంగా పోరాడాలన్న ఆయన చంద్రబాబు ధైర్యం ఉంటే తిరుపతి చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పాలన్నారు. చంద్రబాబు నాయుడు తోక ప్రజలు ఎప్పుడో కత్తిరించారని అన్నారు.
సంక్షేమ పాలన ఎక్కడైనా ఉందా..?
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలన ఎక్కడైనా ఉందా..? సీఎం జగన్మోహన్ రెడ్డి కంటే బాగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిపాలన చేస్తున్నమని బీజేపీ నాయకులు చెప్పగలరా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మాయలు ఇక పని చేయవని చంద్రబాబు నాయుడితో ప్రజలు విసిగిపోయారని అన్నారు.
- Tags
- achhennaidu
- botsa
- corona
- tdp
- viral vedio
తాజావార్తలు
-
SPR India: వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ అంటే ఏమిటి? చమురు సంక్షోభంలో జాతీయ భద్రతా కవచంగా ఎలా ఉపయోగపడుతుంది?
-
Janhvi Kapoor : క్రేజీ ఛాన్స్ కొట్టేసిన జాన్వీ… “తుంబాడ్” డైరెక్టర్ తో హార్రర్ మూవీ
-
Bharathiraja Passed Away : తమిళ సినీ దిగ్గజం అస్తమయం.. దర్శకుడు భారతీరాజా కన్నుమూత
-
Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?