AP Reorganisation : రేపు పార్లమెంట్లో ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026
- అమరావతికి చట్టబద్ధ గుర్తింపు దిశగా అడుగు
- లోక్సభలో రేపు సవరణ బిల్లు ప్రవేశం
- రాజధాని అనిశ్చితికి ముగింపు సంకేతాలు
- పెట్టుబడిదారుల్లో పెరిగే నమ్మకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతిని రాష్ట్ర అధికారిక రాజధానిగా స్థిరపరుస్తూ, దానికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో ‘ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026’ను రేపు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుని, కేంద్రం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.
LIK: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ సెన్సార్ కంప్లిట్..
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం, పదేళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పేర్కొన్నారు. ఆ గడువు ముగిసిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ తన సొంత రాజధానిని ఏర్పాటు చేసుకునే వీలుంది. అయితే, చట్టంలో ఉన్న సాంకేతిక అంశాలను సవరిస్తూ, ఇకపై ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ అని స్పష్టంగా పేర్కొంటూ ఈ సవరణ చేయబోతున్నారు. దీనివల్ల అమరావతికి ఒక స్థిరమైన రూపం ఏర్పడటమే కాకుండా, భవిష్యత్తులో రాజధాని మార్పు వంటి రాజకీయ అనిశ్చితులకు తావు లేకుండా పోతుంది.
Leander Paes: బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. బీజేపీలో చేరిన లియాండర్ పేస్
రేపు లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత సుమారు గంట పాటు చర్చ జరగనుంది. అనంతరం లోక్సభ ఆమోదం పొందిన వెంటనే, ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. రేపు లేదా ఎల్లుండి (ఏప్రిల్ 2) కల్లా రాజ్యసభలో కూడా చర్చ ముగిసి బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. దీంతో అమరావతికి రాజ్యాంగబద్ధమైన గుర్తింపు లభించనుంది. రాజధానిపై స్పష్టత లేకపోవడంతో గత కొన్నేళ్లుగా అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వెనుకాడారు. ఇప్పుడు కేంద్రం నేరుగా చట్ట సవరణ చేస్తుండటంతో, అంతర్జాతీయ సంస్థలు , పెట్టుబడిదారుల్లో నమ్మకం కలగనుంది. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి , మౌలిక సదుపాయాల కల్పనకు భారీ ఊతాన్నిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?