Leander Paes: బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. బీజేపీలో చేరిన లియాండర్ పేస్
- బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం
- బీజేపీలో చేరిన మాజీ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్
- బీజేపీకి బూస్ట్లాంటిది అన్న కేంద్రమంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

Also Read
- Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
- El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అలర్ట్.. వాటి విషయంలో ఆందోళన అక్కర్లేదని భరోసా
- CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
- Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
ఈ సందర్భంగా లియాండర్ పేస్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్లకు కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. తాను ముఖ్యంగా క్రీడలు, యువత అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. బెంగాల్తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు. 1986లో తన క్రీడా ప్రయాణం ప్రారంభించినప్పుడు అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. ప్రస్తుతం పరిస్థితులు మెరుగయ్యాయన్నారు. అయినా కూడా ఇంకా అభివృద్ధికి అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

లియాండర్ పేస్ చేరికపై సుకాంత మజుందార్ మాట్లాడుతూ.. బెంగాల్ బీజేపీకి ఇది పెద్ద బూస్ట్ అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పేస్ ప్రచారం చేస్తారని తెలిపారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి గత 12 ఏళ్లుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలే పేస్ను ఆకర్షించాయని చెప్పారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్లో పేస్ సాధించిన కాంస్య పతకం దేశానికి గర్వకారణమని కొనియాడారు.
టీఎంసీ నుంచి బీజేపీ వైపు
లియాండర్ పేస్ 2021లో తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. కానీ ఎప్పుడూ కూడా యాక్టివ్ కనిపించలేదు. ఇటీవల పార్టీ కార్యకలాపాల్లోనూ పెద్దగా పాత్ర లేకపోవడంతో భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మార్చి 24న కోల్కతాలో నితిన్ నబీన్ను కలిసిన తర్వాత బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి మంగళవారం కమలం గూటికి చేరిపోయారు.
పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికలు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.
ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో తెలంగాణ సాఫ్ట్వేర్ జంట ఆత్మహత్య.. కారణమిదేనా?
ఇది కూడా చదవండి: Inter Result: అంతులేని విషాదం.. ఇంటర్ ఫలితాలు విడుదల.. ప్రాణాలతో లేని ‘టాపర్’
ఇది కూడా చదవండి: IPS Couple Wedding: అప్పగింతల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన ఐపీఎస్ పెళ్లికూతురు అన్షికా వర్మ
తాజావార్తలు
-
Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
-
Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
-
Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. టన్నుకు రూ.351 పెంపు..
-
Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
-
El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అలర్ట్.. వాటి విషయంలో ఆందోళన అక్కర్లేదని భరోసా
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!