ఇంటర్నల్స్ ఆధారంగా విద్యార్దుల ఉత్తీర్ణతను నిర్ణయించలేం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి సుప్రీం కోర్టు లో ఏపీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడం మినహాయించి, ఇంకో విశ్వసించదగ్గ సరైన ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. పాఠశాలలు నిర్వహించే “ఇంటర్నల్ పరీక్షల” పై ఇంటర్మీడియట్ బోర్డు కు అజమాయిషీ లేదు. కాబట్టి, “ఇంటర్నల్ పరీక్షల” ఆధారంగా సరైన రీతిలో ఖచ్చితమైన విద్యార్దుల ఉత్తీర్ణతలను నిర్ణయించలేం అని తెలిపింది. 2007, 2011 సంవత్సరాలలో (EAPCET) కామన్ ఎంట్రన్స్ పరీక్షల్లో 25 శాతం వైటేజ్ మార్కులు విద్యార్దులకు అదనంగా ఇచ్చారు. ఆ కారణంగా, విద్యార్దుల భవిష్యత్తును నిర్ణయుంచడంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయు. ఇప్పటికే, మార్చి 31 వ తేదీ నుంచి ఏప్రిల్ 21 వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు కూడా నిర్వహించడమైనది. రోజు మార్చి రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం (11 వ తరగతి, 12 వ తరగతి) విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.
అయితే జులై నెల చివరి వారంలో పరీక్షలు నిర్వహించాలని తాత్కాలికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 15 రోజులు ముందుగానే విద్యార్థులకు, తల్లితండ్రులుకు పరీక్ష సమయం, పరీక్ష తేదీల పూర్తి సమాచారం అందజేస్తాం. పరీక్ష నిర్వహించే ఒక్కో గదిలో 15 నుంచి 18 మంది విద్యార్దులు కూర్చునే విధంగా ఏర్పాట్లు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కు చెందిన మొత్తం విద్యార్దులు 5,12, 959 మంది కాగా, రెండవ సంవత్సరం విద్యార్థులు మొత్తం 5,19, 510 మంది పరీక్షలకు హాజరవ్వనున్నట్లు అఫిడవిట్ లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ఇంటర్మీడియట్ లో ఆర్ట్స్ విద్యార్దులు 5 సబ్జెక్టులు, సైన్సు విద్యార్థులు 6 సబ్జెక్టులలో పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. మొత్తంగా ఒక్కో విద్యార్థి 5 నుంచి 6 రోజులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. పరీక్ష కు హాజరయ్యే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రతి పరీక్ష కేంద్రంలో మాస్కులు, శానిటైజర్లు, ధర్మల్ స్కానర్సు ఏర్పాటు చేస్తామని అఫిడవిట్ లో తెలిపింది ఏపీ ప్రభుత్వం. “కోవిడ్” నిబంధనలకు అనుగుణంగా, ఇతరత్రా అన్ని నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
Also Read
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..