Madanapalle Sub Collector Office incident: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ ఘటనలో విచారణ ముమ్మరం.. రేపటి నుంచి ఫిర్యాదుల స్వీకరణ
- మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనలో విచారణ ముమ్మురం..
- అక్కడే మకాం వేసిన రెవెన్యూ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోడియం..
- రేపు సాయంత్రం 4 గంటల నుంచి ప్రజల నుంచి భూ వివాదాలపై ఫిర్యాదుల స్వీకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madanapalle Sub Collector Office incident: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో రికార్డుల కాల్చివేతకు సంబంధించిన కేసులో అధికారుల విచారణ ముమ్మురంగా కొనసాగుతోంది. రెవెన్యూ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోడియం.. నిన్నటి నుంచి ఇక్కడే మకాం వేసి భూ వివాదాలపై ఆరా తీస్తున్నారు. ఇక, రేపు సాయంత్రం 4 గంటల నుంచి ప్రజల నుంచి భూ వివాదాలపై ఫిర్యాదులు స్వీకరించనున్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, సీఐడీ అధికారులు కలెక్టర్ కార్యాలయంలోనే మకాం వేశారు. 25 అంశాలకు సంబంధించి దాదాపు 1,000 పైగా ఫైలు పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సగం కాలిపోయిన మరో ఏడువందల రికార్డులను రెవెన్యూ అధికారులకు అప్పగించి వాటికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.
Also Read
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
- Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
- Madanapalle Minor Girl Case: మదనపల్లె చిన్నారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు..
- Software Engineers Death: పోటీపడి 19 బీర్లు తాగారు.. మద్యం ఎక్కువై ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి
ఇక, ఈ అంశంలో కుట్ర కోణం దాగు ఉందనే వివరాల మేరకు.. ఘటన జరిగిన విషయం తెలిసిన ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలపై మదనపల్లి సీఐ వలిబసు వీఆర్ కు పంపారు. ఆదివారం రాత్రి నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ హరి ప్రసాదు, భాస్కర్ ను సస్పెండ్ చేశారు. ఇక ఎన్నికల ముందు ఆర్డీవోగా పనిచేసిన మురళి ఘటనకు రెండు రోజుల ముందు మదనపల్లిలోనే మకాం వేసి కార్యాలయం కూడా వచ్చి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? ఏంటి? అనే దానిపై ఆరా తీయడానికి మూడు రోజుల నుంచి అతని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతనితోపాటు ఇటీవల బదిలీ అయిన ఆర్డీవో హరిప్రసాద్, వీఆర్ఏ రమణయ్య ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Also: Nitish Kumar: ‘‘ మీరు మహిళ, మీకు ఏం తెలియదు’’.. ఆర్జేడీ ఎమ్మెల్యేపై సీఎం ఫైర్..
మరోవైపు, రాత్రి ఘటన జరిగిన సమయంలో కార్యాలయంలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ను కూడా మూడు రోజుల నుంచి పోలీసు అధికారులు, జిల్లా రెవెన్యూ యంత్రంగా విచారణ చేస్తోంది. ఇంకా ఎవరెవరు ఈ కుట్రలో పాలుపంచుకున్నారని దానిపైన జిల్లా రెవెన్యూ యంత్రాంగం పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఉదయం అగ్నిమాపకశాఖ రాష్ట్ర డైరెక్టర్ వెంకటరమణ సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి సంఘటన తీరును పరిశీలించారు. ఆ రోజు సంఘటన జరిగినప్పుడు ఏ విధంగా జరిగింది సమాచారం ఎవరిచ్చారు అనేదానిపై ఆరా తీశారు.. ఇక ఈ కేసులో దస్త్రాలు కాలిపోవడానికి ప్రధాన సూత్రధరునిగా అనుమానిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిన్న ఆయన ఇంట్లోకి వెళ్లి సోదలు నిర్వహించగా తప్పించుకొని పారిపోయినట్లు తెలుస్తోంది. ఆయన ఏ ప్రాంతంలో ఉన్నాడు ఏంటి అనేదానిపై పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
Read Also: India Passport Rank: అత్యంత శక్తిమంతమైన పాస్పోర్టుల్లో భారత్ ర్యాంక్ ఇంత దారుణమా.?
అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కేసులో 35మందికిపైగా అనుమానితులను గుర్తించినట్లు తెలిపారు. వారందరిని అదుపులో తీసుకుని విచారిస్తున్నామని పోలీసు శాఖతో పాటు పనిచేసినా వివిధ శాఖల దర్యాప్తుపై నివేదిక త్వరలో రానునుందని.. ఆ నివేదిక తరువాత మరింత దూకుడుగా కేసులోముందుకు వెలుతామన్నారు. ఇక ఉద్యోగి గౌతమ్ బీరువాలో ఇంజెన్ ఆయిల్ ఉన్నట్లు విచారణ తెలిసిందని.. అయితే అది వ్యక్తగత వాహనం కోసం తెచ్చుకున్నాట్లుగా విచారణలో గౌతమ్ తెలిపాడని.. కానీ, దానివల్ల ప్రమాదం జరిగిందా? లేదా? అనేదానిపై దర్యాప్తు సాగుతోందన్నారు. ఇక సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తుంది.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..