CM Revanth Reddy : కేంద్ర బడ్జెట్పై అసెంబ్లీలో తీర్మానం… నీతి ఆయోగ్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం
- తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కేంద్ర బడ్జెట్పై తీర్మానం
- తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్
- తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారన్న సీఎం
- తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారని వ్యాఖ్య
- గడిచిన పదేళ్లు ఆ చట్టాలను అమలు చేయలేదని మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కేంద్ర బడ్జెట్పై తీర్మానం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారన్నారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారని, గడిచిన పదేళ్లు ఆ చట్టాలను అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేదని, మేం అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఢిల్లీ వెళ్లామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను ప్రస్తావించామి, పెద్దన్న పాత్ర పోషించాలని మోడీని కోరానన్నారు. మోడీని పెద్దన్న అని కీర్తిస్తే నాకు వచ్చేది ఏముంది.? రాష్ట్రాలకు పెద్దన్నలాగా వ్యవహరించాలని కోరానని, ఎవరి దగ్గర వంగిపోవడమో, లొంగిపోవడమో చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
CM Revanth Reddy : ఇద్దరం సచ్చుడో, నిధులు తెచ్చుడో చూద్దాం
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
అంతేకాకుండా.. ‘తెలంగాణపై వివక్ష కాదు, కచ్చితంగా కక్ష. కొందరు త్యాగాలు చేశామని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే కాకముందే మంత్రిని చేసింది కాంగ్రెస్ కాదా.? పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ రూపాయి చెల్లిస్తే 45 పైసలు కూడా తిరిగి ఇస్తలేదు. అదే బీహార్ రూపాయి చెల్లిస్తే, కేంద్రం తిరిగి రూ.7 ఇస్తోంది. గుజరాత్లో మోడీ తన ఎస్టేట్లు అమ్మి మనకు ఏమైనా ఇచ్చారా.? తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.3.67 లక్షల కోట్లు వెళ్లాయి. కేంద్రం నుంచి వచ్చింది రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే. ఐదు దక్షిణాది రాష్ట్రాలు రూ. 22.66 లక్షల కోట్ల పన్ను చెల్లించాయి. పదేళ్లలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చింది కేవలం రూ.6లక్షల కోట్లు. యూపీ రూ.3.47లక్షల కోట్లు పన్ను చెల్లిస్తే, అక్కడ కేంద్రం రూ.6.91 లక్షల కోట్లు ఖర్చు చేసింది. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తుంది. ఈనెల 27న జరగబోయే నీతి ఆయోగ్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం. పార్లమెంట్లో ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలి.’ అని సీఎం రేవంత్ రెడ్డిఅన్నారు.
India Passport Rank: అత్యంత శక్తిమంతమైన పాస్పోర్టుల్లో భారత్ ర్యాంక్ ఇంత దారుణమా.?
అయితే.. తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్ తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా వేశారు. రేపు తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
తాజావార్తలు
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!