CM Revanth Reddy : కేంద్ర బడ్జెట్పై అసెంబ్లీలో తీర్మానం… నీతి ఆయోగ్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం
- తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కేంద్ర బడ్జెట్పై తీర్మానం
- తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్
- తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారన్న సీఎం
- తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారని వ్యాఖ్య
- గడిచిన పదేళ్లు ఆ చట్టాలను అమలు చేయలేదని మండిపాటు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కేంద్ర బడ్జెట్పై తీర్మానం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారన్నారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారని, గడిచిన పదేళ్లు ఆ చట్టాలను అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేదని, మేం అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఢిల్లీ వెళ్లామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను ప్రస్తావించామి, పెద్దన్న పాత్ర పోషించాలని మోడీని కోరానన్నారు. మోడీని పెద్దన్న అని కీర్తిస్తే నాకు వచ్చేది ఏముంది.? రాష్ట్రాలకు పెద్దన్నలాగా వ్యవహరించాలని కోరానని, ఎవరి దగ్గర వంగిపోవడమో, లొంగిపోవడమో చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
CM Revanth Reddy : ఇద్దరం సచ్చుడో, నిధులు తెచ్చుడో చూద్దాం
Also Read
అంతేకాకుండా.. ‘తెలంగాణపై వివక్ష కాదు, కచ్చితంగా కక్ష. కొందరు త్యాగాలు చేశామని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే కాకముందే మంత్రిని చేసింది కాంగ్రెస్ కాదా.? పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ రూపాయి చెల్లిస్తే 45 పైసలు కూడా తిరిగి ఇస్తలేదు. అదే బీహార్ రూపాయి చెల్లిస్తే, కేంద్రం తిరిగి రూ.7 ఇస్తోంది. గుజరాత్లో మోడీ తన ఎస్టేట్లు అమ్మి మనకు ఏమైనా ఇచ్చారా.? తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.3.67 లక్షల కోట్లు వెళ్లాయి. కేంద్రం నుంచి వచ్చింది రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే. ఐదు దక్షిణాది రాష్ట్రాలు రూ. 22.66 లక్షల కోట్ల పన్ను చెల్లించాయి. పదేళ్లలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చింది కేవలం రూ.6లక్షల కోట్లు. యూపీ రూ.3.47లక్షల కోట్లు పన్ను చెల్లిస్తే, అక్కడ కేంద్రం రూ.6.91 లక్షల కోట్లు ఖర్చు చేసింది. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తుంది. ఈనెల 27న జరగబోయే నీతి ఆయోగ్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం. పార్లమెంట్లో ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలి.’ అని సీఎం రేవంత్ రెడ్డిఅన్నారు.
India Passport Rank: అత్యంత శక్తిమంతమైన పాస్పోర్టుల్లో భారత్ ర్యాంక్ ఇంత దారుణమా.?
అయితే.. తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్ తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా వేశారు. రేపు తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!