Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Sajjala Ramakrishna Reddy Teleconference With Ysrcp Top Leaders And Key Orders Issued

Sajjala Ramakrishna Reddy: వైసీపీ ముఖ్యనేతలతో సజ్జల టెలీకాన్ఫరెన్స్‌.. కీలక ఆదేశాలు

Published Date :March 7, 2025 , 4:57 pm
By Sudhakar Ravula
  • వైసీపీ ముఖ్యనేతలతో సజ్జల టెలీకాన్ఫరెన్స్‌ ..
  • ఈ నెల 12వ తేదీన ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
  • వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి..
Sajjala Ramakrishna Reddy: వైసీపీ ముఖ్యనేతలతో సజ్జల టెలీకాన్ఫరెన్స్‌.. కీలక ఆదేశాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన పార్టీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి.. కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఈ నెల 12వ తేదీన ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. ఇక, అదే రోజు వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి సూచించారు.. ఇది అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలబడాల్సిన సందర్భం.. లక్షలాది మంది విద్యార్ధులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై వారి పక్షాన శాంతియుతంగా వైసీపీ ఈ కార్యక్రమం చేపడుతోంది.. పార్టీ క్యాడర్‌ అంతా క్రియాశీలకంగా దీనిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.. టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, రీజనల్‌ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్యనేతలకు కీలక సూచనలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి..

Read Also: Infosys: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాక్.. ఇకపై ఆఫీసుకు రావాల్సిందే..

లక్షలాది మంది విద్యార్ధులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫీజు పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ శ్రేణులు, ఆయా వర్గాల ప్రజలు సంయుక్తంగా ర్యాలీగా జిల్లా కలెక్టర్‌కు మెమోరాండంను సమర్పించాలి. మొత్తం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్పాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి.. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికే విజయవంతమైంది. ఆ తర్వాత విద్యుత్‌ ఛార్జీలపై చేసిన కార్యక్రమం కూడా అదే స్ధాయిలో విజయవంతం అయింది. ఈ రెండు కార్యక్రమాల ద్వారా వైసీపీ ఎంత బలంగా ఉందో, ప్రజాసమస్యలపై ఎంత దృఢంగా ఉందో వెల్లడైందన్నారు..

Read Also: Jr NTR: ‘ఎన్టీఆర్’ భయంకరమైన లుక్.. ఏందన్న ఈ దారుణం?

ఇక, ఈ నెల 12న మన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతీ చోటా ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలి, మన పార్టీపై ఉన్న ప్రజాభిమానం ఈ సందర్భంగా వెల్లడవ్వాలని సూచించారు సజ్జల.. అందుకే పార్టీ క్యాడర్‌ అంతా ఉత్సాహంగా పాల్గొని ప్రజాభిమానం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాలి, ఈ వేడుకలను అందరం విజయవంతం చేద్దాం, ఈ కార్యక్రమాన్ని ఉదయాన్నే పూర్తి చేసుకుని అనంతరం ఫీజు పోరు కార్యక్రమం నిర్వహించాలన్నారు.. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామాల నుంచి రాష్ట్రస్ధాయి వరకూ వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలన్నారు.. మరోవైపు, సోషల్‌ మీడియాకు సంబంధించి కొత్తగా మరికొంతమంది కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారు, వారికి అవసరమైన న్యాయసహాయం అందించేందుకు లీగల్‌ సెల్‌ సిద్ధంగా ఉందని.. ఏ సమయంలో ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే లీగల్‌ సెల్‌ను అప్రమత్తం చేసి వారికి అండగా నిలబడాలని కీలక సూచనలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • sajjala ramakrishna reddy
  • ys jagan
  • YSRCP

తాజావార్తలు

  • Repo Rate: రెపో రేట్ పై ఆర్‌బీఐ గవర్నర్ కీలక ప్రకటన.. ఈఎంఐ తగ్గుతుందా?

  • Gold-Silver Rates: సీజ్‌ఫైర్ వేళ గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు

  • Best Scooters: హీరో జూమ్, అప్రిలియా, యమహా ఏరాక్స్.. ఏ పెట్రోల్ స్కూటర్ బెస్ట్? ధర, మైలేజీ వివరాలు ఇవే

  • Netanyahu: ఆ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదు.. దాడులు కొనసాగిస్తామన్న నెతన్యాహు

  • Peddi- Lenin:రామ్ చరణ్ వర్సెస్ అఖిల్.. ‘పెద్ది’ భయంతో ‘లెనిన్’ వెనక్కి!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions