AP CM Chandrababu: జమిలీ ఎన్నికలకు దేశం మొత్తం మద్దతు తెలిపాలి..
- జమిలీ ఎన్నికలకు దేశం మొత్తం మద్దతు తెలిపాలి- చంద్రబాబు
- ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానం వల్ల ప్రజలకు.. రాష్ట్రాలకు మేలు జరుగుతుంది- సీఎం
- హర్యానాలో మూడోసారి బీజేపీ గెలవడం కేంద్ర సుపరిపాలనకు నిదర్శనం- సీఎం
- ఉదయం ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపా- చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమిలీ ఎన్నికలకు దేశం మొత్తం మద్దతు తెలిపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానం వల్ల ప్రజలకు, రాష్ట్రాలకు మేలు జరుగుతుందని తెలిపారు. హర్యానాలో మూడోసారి బీజేపీ గెలవడం కేంద్ర సుపరిపాలనకు నిదర్శనం.. ఎన్ని అపోహలు, ప్రచారాలు జరిగినా.. హర్యానా, జమ్మూ కాశ్మీరులో మంచి పరిపాలనపై నమ్మకంతోనే ఎన్డీఏను గెలిపించారన్నారు. ఉదయం ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపానని పేర్కొన్నారు.
జమ్మూ కశ్మీరులో బలమైన పార్టీగా బీజేపీ అవతరించింది.. చెప్పే విధానం సరిగ్గా ఉండి, చేసేది మంచైనప్పుడు మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్లో త్వరలో జరిగే ఎన్నికల్లో కూడా ఈ తరహా ఫలితాలే వస్తాయని విశ్వసిస్తున్నాని తెలిపారు. బీజేపీ అధిష్టానం నిర్ణయాలను ప్రజలు ఆమోదిస్తున్నారు.. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ బలం పెరిగింది.. హర్యానా, జమ్మూ అండ్ కశ్మీర్ ఎన్నికల్లో ఫలితాలే దీనికి నిదర్శనం అని చంద్రబాబు తెలిపారు.
CM Revanth Reddy : ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read
- CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్పాట్.!
- Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
- Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు
- CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
ఈ ఎన్నికల ఫలితాలు చరిత్రాత్మకం.. త్వరలోనే భారత దేశం 3వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు అన్నారు. పొత్తు పెట్టుకుని ఎన్డీఏలో భాగస్వామ్యమై దేశాభివృద్ధిలో తామూ ఉన్నందుకు గర్వపడుతున్నానని తెలిపారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే గత 5 ఏళ్లలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది.. ఎవరి పరిపాలన వల్ల మంచి జరుగుతుందో, విజన్ వల్ల కలిగే లాభాల పట్ల ప్రజలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.. రానున్న రోజుల్లో ఒక్క ఏపీలోనే రూ.75వేల కోట్ల ఒక్క రైల్వే మౌలిక సదుపాయాల కోసమే ఖర్చు చేస్తున్నారన్నారు. దక్షిణ భారత దేశంలో బెంగుళూరు-చెన్నై-అమరావతి-హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలను కలిపేలా బులెట్ ట్రైన్ తెచ్చే ప్రతిపాదనలు ఉన్నాయి.. కేంద్రం వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నప్పుడు అభినందించటం తన బాధ్యత అని సీఎం తెలిపారు.
EV Charging Rates : ToD టారిఫ్ సిస్టమ్ ప్రకారం తెలంగాణలో EV ఛార్జింగ్ రేట్లు
అహంకారంతో విర్రవీగిన వారికి ప్రజలు బుద్ధి చెప్పినా, ప్రజా చైతన్యం ఎంతో అవసరం.. కేంద్ర పథకాలను త్వరితగతిన అందిపుచ్చుకుంటూ వెళ్తే.. రాష్ట్రానికి జరిగిన నష్టం నుంచి వీలైనంత త్వరగా కోలుకుని మళ్లీ నెంబర్1 గా ఎదుగుతామని చంద్రబాబు అన్నారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుండటం మంచి పరిణామం కాదు.. ప్రకాశం బ్యారేజీ ధ్వంసం చేయాలని కుట్ర పన్నిన వాళ్లు వరదల్లో తమ పనితీరును విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. మరోవైపు.. ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి రూ.400 కోట్లు పైన విరాళాలు ఇచ్చారు.. తిరుమల బ్రహ్మోత్సవాలు, దసరా ఉత్సవాలు ఇంత కన్నులపండువగా గత ఐదేళ్లలో ఎప్పుడైనా జరిగాయా? అని అన్నారు. ప్రసాదాలు మొదలు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు.. తమకు ఎవరి వల్ల లాభం జరుగుతుందో ప్రజలు ఆలోచిస్తే.. అది సుస్థిర ప్రభుత్వానికి నాంది పలుకుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!