Adimulapu Suresh: శవాలపై రాజకీయం చేయడం.. చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adimulapu Suresh Fires On Chandrababu Naidu: టీడీసీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు చవకబారు రాజకీయాలు అందరికీ తెలుసని మండిపడ్డారు. పేదవాళ్లకు ఇళ్లు ఇవ్వటానికి మీరు వ్యతిరేకమా? పేదలకు భూములు ఇవ్వవద్దని చట్టం తెస్తారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అమరావతిలో పేదలకు భూములు ఇవ్వాలని సీఎం జగన్ ఆలోచన చేశారని, రాజ్యాంగ వ్యతిరేకంగా ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. సీఆర్దీఏ చట్టం ప్రకారమే పేదలకు భూములు అందజేయాలని జగన్ అనుకున్నారని అన్నారు. అమరావతిలో కేవలం ధనికులే ఉండాలా అని నిలదీశారు.
Also Read
- Pawan Kalyan : ఏపీలో రక్షణ రంగ విప్లవం.. మెగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.!
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
పేదలకు మంచి జరుగుతుందనుకుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అయినా తాము వెనక్కు తగ్గేది లేదని, అన్నీ అనుమతులు తీసుకుని ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు. చంద్రబాబుకు శవాలపై రాజకీయం చేయటం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటనకు వచ్చే ముందు.. దళితులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి రావాలని కోరామన్నారు. ఆయన పర్యటన సమయంలో శాంతియుతంగా నిరసన తెలపాలని అనుకున్నామన్నారు. అయితే.. తమ క్యాంప్ ఆఫీస్ దగ్గరకు రాగానే, చంద్రబాబు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారన్నారు. వాళ్ళు ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేశారన్నారు. రాళ్లు ఎవరు నువ్వారో అందరూ చూశారని, ఈ ఘటనపై పూర్తి విచారణ చేయిస్తామని చెప్పారు.
GVL Narasimha Rao: కొడాలి నానిపై జీవీఎల్ పరోక్ష కామెంట్లు.. నోరు అదుపులో పెట్టుకోవాలి
అంతకుముందు.. అమరావతి లో ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఆదిమూలపు సురేష్ అన్నారు. పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఎంత దూరమైనా వెళ్తామని తెలిపారు. అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టులో కేసులు వేశారని, అమరావతి రైతుల ముసుగులో టీడీపీ నాయకులు కోర్టులో కేసులు వేశారని ఆరోపించారు. అమరావతిలో టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారన్నారు. త్వరలోనే అమరావతిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
Sajjala : ఎంపీ అవినాష్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు..
తాజావార్తలు
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!