Ganga Ramayan Tour: గంగా రామాయణం టూర్ ప్యాకేజీ.. యాత్ర విశేషాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవిత్ర గంగా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. భక్తులు కాశీనాథుడి దర్శనం కోసం బారులు తీరారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించాలనుకునే భక్తుల కోసం IRCTC టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.’గంగా రామాయణ’ యాత్ర టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుండి నడుస్తోంది. ఇది పర్యాటకులను విమానంలో తీసుకెళ్లి వారణాసి, అయోధ్య, నైమిశారణ్య, ప్రయాగ్రాజ్, సారనాథ్లోని దేవాలయాలను చూపిస్తారు. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీ మే 4న అందుబాటులోకి వస్తుంది.
Also Read:Flight to Alaska: ఛీఛీ.. విమానంలో పాడు పని!
IRCTC గంగా రామాయణ యాత్ర మొదటి రోజు హైదరాబాద్లో ప్రారంభమవుతుంది. వారణాసి చేరుకున్న అనంతరం హోటల్లో చెక్-ఇన్ చేసిన తర్వాత కాశీ విశ్వనాథ దేవాలయం, గంగా ఘాట్ సందర్శించండి. వారణాసిలో రాత్రి బస చేస్తారు. రెండవ రోజు ఉదయం సారనాథ్ బయలుదేరవలసి ఉంటుంది. మధ్యాహ్నం వారణాసికి తిరుగు ప్రయాణం. సాయంత్రం ఖాళీ సమయం ఉంటుంది. ఘాట్లను సందర్శించవచ్చు లేదా షాపింగ్ చేయవచ్చు. వారణాసిలో రాత్రి బస చేస్తారు.
Also Read:Rahul Gandhi: నిజం మాట్లాడినందుకు మూల్యం.. బంగ్లా ఖాళీ చేసిన రాహుల్
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
మూడవ రోజు వారణాసిలో చెక్ అవుట్ చేసి, ప్రయాగ్రాజ్కి బయలుదేరుతారు. అలోపి దేవి ఆలయం, త్రివేణి సంగమం చూడవచ్చు. సాయంత్రం అయోధ్యకు వెళ్తారు. రాత్రికి అయోధ్యలో బస చేస్తారు. నాల్గవ రోజు అయోధ్య ఆలయ సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం లక్నోకు వెళ్లి రాత్రికి బస చేస్తారు. ఇక, ఐదవ రోజు నైమిశారణ్యం పూర్తి రోజు దర్శనం ఉంటుంది. సాయంత్రం లక్నోకు తిరిగి వెళ్లి రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆరవ రోజు బారా ఇమాంబర, అంబేద్కర్ మెమోరియల్ పార్క్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ ప్రయాణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు విమానం లక్నో చేరుకుని రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. IRCTC గంగా రామాయణ్ యాత్ర టూర్ ప్యాకేజీ ధరను పరిశీలిస్తే.. మీరు ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.28,200, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.29,900, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.36,850 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో విమాన టిక్కెట్లు, హోటల్, అల్పాహారం, రాత్రి భోజనం, ఏసీ బస్సులో సందర్శనా, ప్రయాణ బీమా వంటివి ఉంటాయి.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!