Ganga Ramayan Tour: గంగా రామాయణం టూర్ ప్యాకేజీ.. యాత్ర విశేషాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవిత్ర గంగా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. భక్తులు కాశీనాథుడి దర్శనం కోసం బారులు తీరారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించాలనుకునే భక్తుల కోసం IRCTC టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.’గంగా రామాయణ’ యాత్ర టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుండి నడుస్తోంది. ఇది పర్యాటకులను విమానంలో తీసుకెళ్లి వారణాసి, అయోధ్య, నైమిశారణ్య, ప్రయాగ్రాజ్, సారనాథ్లోని దేవాలయాలను చూపిస్తారు. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీ మే 4న అందుబాటులోకి వస్తుంది.
Also Read:Flight to Alaska: ఛీఛీ.. విమానంలో పాడు పని!
IRCTC గంగా రామాయణ యాత్ర మొదటి రోజు హైదరాబాద్లో ప్రారంభమవుతుంది. వారణాసి చేరుకున్న అనంతరం హోటల్లో చెక్-ఇన్ చేసిన తర్వాత కాశీ విశ్వనాథ దేవాలయం, గంగా ఘాట్ సందర్శించండి. వారణాసిలో రాత్రి బస చేస్తారు. రెండవ రోజు ఉదయం సారనాథ్ బయలుదేరవలసి ఉంటుంది. మధ్యాహ్నం వారణాసికి తిరుగు ప్రయాణం. సాయంత్రం ఖాళీ సమయం ఉంటుంది. ఘాట్లను సందర్శించవచ్చు లేదా షాపింగ్ చేయవచ్చు. వారణాసిలో రాత్రి బస చేస్తారు.
Also Read:Rahul Gandhi: నిజం మాట్లాడినందుకు మూల్యం.. బంగ్లా ఖాళీ చేసిన రాహుల్
Also Read
- Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
- CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
మూడవ రోజు వారణాసిలో చెక్ అవుట్ చేసి, ప్రయాగ్రాజ్కి బయలుదేరుతారు. అలోపి దేవి ఆలయం, త్రివేణి సంగమం చూడవచ్చు. సాయంత్రం అయోధ్యకు వెళ్తారు. రాత్రికి అయోధ్యలో బస చేస్తారు. నాల్గవ రోజు అయోధ్య ఆలయ సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం లక్నోకు వెళ్లి రాత్రికి బస చేస్తారు. ఇక, ఐదవ రోజు నైమిశారణ్యం పూర్తి రోజు దర్శనం ఉంటుంది. సాయంత్రం లక్నోకు తిరిగి వెళ్లి రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆరవ రోజు బారా ఇమాంబర, అంబేద్కర్ మెమోరియల్ పార్క్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ ప్రయాణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు విమానం లక్నో చేరుకుని రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. IRCTC గంగా రామాయణ్ యాత్ర టూర్ ప్యాకేజీ ధరను పరిశీలిస్తే.. మీరు ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.28,200, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.29,900, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.36,850 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో విమాన టిక్కెట్లు, హోటల్, అల్పాహారం, రాత్రి భోజనం, ఏసీ బస్సులో సందర్శనా, ప్రయాణ బీమా వంటివి ఉంటాయి.
తాజావార్తలు
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Chiru – Bobby Movie: ‘చిరు 158’లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ‘జైలర్’ డీవోపీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..