Parliament Impasse: లోక్ సభ స్పీకర్తో ప్రధాని మోదీ భేటీ.. రాహుల్ అంశంపై చర్చ?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్షాల ఆందోళనలతో బడ్జెట్ సెషన్ లో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు రోజంతా వాయిదా పర్వం కొనసాగింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు ఇవాళ సాయంత్రం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు. సీనియర్ మంత్రులు రాజ్నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి, కిరణ్ రిజిజు తదితరులు ప్రధాని మోదీ వెంట ఉన్నారు. పార్లమెంట్ లో ప్రతిష్టంభనపై చర్చించినట్లు తెలుస్తోంది.
Also Read: BJP: కాంగ్రెస్ అధినేత సొంత జిల్లాలో బీజేపీదే విజయం
ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష పడింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ తో మోదీ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయాలని బిజెపి తీవ్రంగా పట్టుబడుతోంది. అయితే, ప్రస్తుతం నిర్ణయం స్పీకర్ వద్ద ఉంది.
Also Read:Accenture layoff: ఐటీ దిగ్గజం యాక్సెంచర్లో కలవరం..19 వేల మంది ఉద్యోగుల తొలగింపు
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
గత వారం నుండి అదానీ-హిండెన్బర్గ్ వివాదంపై ప్రతిపక్షాలు పార్లమెంటులో ఆందోళనలు చేస్తున్నాయి. అలాగే, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేశాయని ఆరోపిస్తున్నాయి. హిండెన్బర్గ్-అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని కోరుతూ కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. పలువురు సభ్యులు స్పీకర్ పోడియం దగ్గర కూడా బైఠాయించారు. అయితే, కేంబ్రిడ్జ్లో భారత ప్రజాస్వామ్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్ చేసింది.
కాగా,ప్రధాని మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ గాంధీని గుజరాత్లోని సూరత్ కోర్టు గురువారం దోషిగా తేల్చింది. పరువునష్టం కేసులో ఆయనకు రెండేళ్ల శిక్ష సైతం విధించింది. అయితే, ఏదైనా నేరానికి రెండేళ్ల శిక్ష పడితే..ఆ ప్రజా ప్రతినిధి అనర్హతకు గురవుతారు. కోర్టు తీర్పు వచ్చిన క్షణం నుంచే ఆ ప్రజాప్రతినిధి అనర్హులు అవుతారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?