Parliament Impasse: లోక్ సభ స్పీకర్తో ప్రధాని మోదీ భేటీ.. రాహుల్ అంశంపై చర్చ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్షాల ఆందోళనలతో బడ్జెట్ సెషన్ లో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు రోజంతా వాయిదా పర్వం కొనసాగింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు ఇవాళ సాయంత్రం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు. సీనియర్ మంత్రులు రాజ్నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి, కిరణ్ రిజిజు తదితరులు ప్రధాని మోదీ వెంట ఉన్నారు. పార్లమెంట్ లో ప్రతిష్టంభనపై చర్చించినట్లు తెలుస్తోంది.
Also Read: BJP: కాంగ్రెస్ అధినేత సొంత జిల్లాలో బీజేపీదే విజయం
ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష పడింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ తో మోదీ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయాలని బిజెపి తీవ్రంగా పట్టుబడుతోంది. అయితే, ప్రస్తుతం నిర్ణయం స్పీకర్ వద్ద ఉంది.
Also Read:Accenture layoff: ఐటీ దిగ్గజం యాక్సెంచర్లో కలవరం..19 వేల మంది ఉద్యోగుల తొలగింపు
Also Read
- Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
గత వారం నుండి అదానీ-హిండెన్బర్గ్ వివాదంపై ప్రతిపక్షాలు పార్లమెంటులో ఆందోళనలు చేస్తున్నాయి. అలాగే, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేశాయని ఆరోపిస్తున్నాయి. హిండెన్బర్గ్-అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని కోరుతూ కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. పలువురు సభ్యులు స్పీకర్ పోడియం దగ్గర కూడా బైఠాయించారు. అయితే, కేంబ్రిడ్జ్లో భారత ప్రజాస్వామ్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్ చేసింది.
కాగా,ప్రధాని మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ గాంధీని గుజరాత్లోని సూరత్ కోర్టు గురువారం దోషిగా తేల్చింది. పరువునష్టం కేసులో ఆయనకు రెండేళ్ల శిక్ష సైతం విధించింది. అయితే, ఏదైనా నేరానికి రెండేళ్ల శిక్ష పడితే..ఆ ప్రజా ప్రతినిధి అనర్హతకు గురవుతారు. కోర్టు తీర్పు వచ్చిన క్షణం నుంచే ఆ ప్రజాప్రతినిధి అనర్హులు అవుతారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!