Parliament Impasse: లోక్ సభ స్పీకర్తో ప్రధాని మోదీ భేటీ.. రాహుల్ అంశంపై చర్చ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్షాల ఆందోళనలతో బడ్జెట్ సెషన్ లో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు రోజంతా వాయిదా పర్వం కొనసాగింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు ఇవాళ సాయంత్రం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు. సీనియర్ మంత్రులు రాజ్నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి, కిరణ్ రిజిజు తదితరులు ప్రధాని మోదీ వెంట ఉన్నారు. పార్లమెంట్ లో ప్రతిష్టంభనపై చర్చించినట్లు తెలుస్తోంది.
Also Read: BJP: కాంగ్రెస్ అధినేత సొంత జిల్లాలో బీజేపీదే విజయం
ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష పడింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ తో మోదీ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయాలని బిజెపి తీవ్రంగా పట్టుబడుతోంది. అయితే, ప్రస్తుతం నిర్ణయం స్పీకర్ వద్ద ఉంది.
Also Read:Accenture layoff: ఐటీ దిగ్గజం యాక్సెంచర్లో కలవరం..19 వేల మంది ఉద్యోగుల తొలగింపు
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
గత వారం నుండి అదానీ-హిండెన్బర్గ్ వివాదంపై ప్రతిపక్షాలు పార్లమెంటులో ఆందోళనలు చేస్తున్నాయి. అలాగే, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేశాయని ఆరోపిస్తున్నాయి. హిండెన్బర్గ్-అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని కోరుతూ కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. పలువురు సభ్యులు స్పీకర్ పోడియం దగ్గర కూడా బైఠాయించారు. అయితే, కేంబ్రిడ్జ్లో భారత ప్రజాస్వామ్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్ చేసింది.
కాగా,ప్రధాని మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ గాంధీని గుజరాత్లోని సూరత్ కోర్టు గురువారం దోషిగా తేల్చింది. పరువునష్టం కేసులో ఆయనకు రెండేళ్ల శిక్ష సైతం విధించింది. అయితే, ఏదైనా నేరానికి రెండేళ్ల శిక్ష పడితే..ఆ ప్రజా ప్రతినిధి అనర్హతకు గురవుతారు. కోర్టు తీర్పు వచ్చిన క్షణం నుంచే ఆ ప్రజాప్రతినిధి అనర్హులు అవుతారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!