Operation Kill Khamenei: 15 నిమిషాల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం! వాల్స్ట్రీట్ జర్నల్ కథనంలో సంచలన నిజాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Kill Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ మృతిపై వాల్స్ట్రీట్ జర్నల్ సంచనల కథనం వెలువరించింది. ఖమేనీ లక్ష్యంగా 30 బాంబు దాడులు జరిగినట్లు ఈ కథనంలో పేర్కొంది. శనివారం ఉదయం ఆపరేషన్ ఖమేనీని అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్తంగా షురూ చేసిందని వెల్లడించింది. శనివారం ఉదయం 1:15 AM ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లు పేర్కొంది. ఫొర్టిఫైడ్ కాంపౌండ్లోనే ఖమేనీ ఇల్లు, ఆఫీస్ ఉండటంతో దాని ఇజ్రాయెల్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైళ్లను ప్రయోగించగా, అమెరికా తొమహాక్ మిస్సైళ్లతో ఎటాక్ చేసినట్లు తెలిపింది.
READ ALSO: Trisha: నచ్చినవాడు దొరికితేనే పెళ్లి.. లేదంటే ఒంటరిగానే!
Also Read
- Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
- Team India: మెగా టోర్నీల్లో మొనగాళ్లు.. ద్విపాక్షిక సిరీస్ల్లో వైఫల్యాలు..1983 - 1985 హిస్టరీ రిపీట్!
- Kitchen Cleaning Hacks: టీ జల్లెడపై నల్లటి మచ్చలా? ఈ ఇంటి చిట్కాతో క్షణాల్లో శుభ్రం..
- Hyderabad: స్విట్జర్లాండ్కు వెళ్లినట్లు చెప్పి అదృశ్యమైన దంపతులు.. రూ.50 కోట్ల మోసం ఆరోపణలతో కొత్త ట్విస్ట్.!
ఖమేనీపై ఈ రెండు దేశాలు గత కొన్నినెలలుగా ఫోకస్ చేశాయని, అమెరికా – ఇజ్రాయెల్ ఆపరేషన్ కిల్ ఖమేనీపై నెలలపాటు ప్లాన్ చేశాయన్నారు. ఈ ఆపరేషన్కు సౌదీ, గల్ఫ్ దేశాలు కూడా మద్దతు తెలిపినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. రెండు వారాల ముందే ఆపరేషన్ లాంచ్ డేట్ ఫిక్స్ అయ్యిందని, సీఐఏ, మొసాద్ ఖమేనీ పక్కా సమాచారం సేకరించినట్లు తెలిపింది. శాటిలైట్ ద్వారా ఖమేనీ లోకేషన్ను ట్రెహాన్లోని ఖమేనీ ఆఫీసులో ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది.
శనివారం టాప్ అధికారులతో ఖమేనీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమేనీతో పాటు ఐఆర్జీసీ కమాండర్ పక్పూర్, డిఫెన్స్ మినిస్టర్ అమీర్ నసిర్, సీనియర్ అడ్వైజర్ అలీ షమ్ఖానీతో సహా 30 మందితో సమావేశం అయ్యారు. మీటింగ్ జరుగుతుండగానే అమెరికా-ఇజ్రాయెల్ లోకేషన్ గుర్తించి 15 నిమిషాల్లోనే ఎటాక్ కంప్లీట్ చేశాయి. ఖమేనీ కాంపౌండ్పై కనీసం7 మిస్సైళ్లతో దాడులు చేయగా, ఫోర్టిఫైడ్ కాంపౌండ్ కుప్పకూలిపోయింది. కూలిన భవనంలోనే ఖమేనీ మృతదేహం లభ్యం అయినట్లు తెలిపింది. ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు కూడా ఈ దాడులో మృతి చెందినట్లు తెలిపింది. ప్రస్తుతం వాల్స్ట్రీల్ జర్నల్ సంచనల కథనం వైరల్ అవుతుంది. ఇదే సమయంలో ఖమేనీ మృతికి యూఎస్, ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటాం ఇరాన్ స్పష్టం చేసింది. యూఎస్ స్థావరాలపై కనీవిని ఎరుగని రీతిలో దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే ఇరాన్ జెరుసలెంపై ఎటాక్ చేసింది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. తాజాగా ఇరాన్.. ఇరాక్, బెహ్రయిన్ టార్గెట్గా మిస్సైల్స్ ఎటాక్కు రెడీ అవుతుంది. ఇరాక్ ఎయిర్పోర్టు సమీపంలోని యూఎస్ ఎయిర్బేస్పై కూడా దాడి చేసింది. అలాగే బెహ్రయిన్లో ఓ హోటల్పైనా ఇరాన్ దాడి చేసింది.
తాజావార్తలు
-
Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
-
Team India: మెగా టోర్నీల్లో మొనగాళ్లు.. ద్విపాక్షిక సిరీస్ల్లో వైఫల్యాలు..1983 – 1985 హిస్టరీ రిపీట్!
-
Kitchen Cleaning Hacks: టీ జల్లెడపై నల్లటి మచ్చలా? ఈ ఇంటి చిట్కాతో క్షణాల్లో శుభ్రం..
-
Flosenso Pro: ఇక ట్యాంక్ చూడాల్సిన పనిలేదు.. మొబైల్లోనే వాటర్ ట్యాంక్ లెవల్, మోటార్ ను కంట్రోల్ చేసే గాడ్జెట్
-
Hyderabad: స్విట్జర్లాండ్కు వెళ్లినట్లు చెప్పి అదృశ్యమైన దంపతులు.. రూ.50 కోట్ల మోసం ఆరోపణలతో కొత్త ట్విస్ట్.!
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!