Pakistan Trolls: మార్పు అవసరమా?.. జిత్తుల మారి ‘నక్వీ’ కారణంగానే పాకిస్థాన్ ఓటములు!
- టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి పాకిస్థాన్ నిష్క్రమణ
- మరోసారి హాట్ టాపిక్గా మారిన కెప్టెన్సీ అంశం
- నక్వీ కారణంగానే పాకిస్థాన్ ఓటములు
టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి పాకిస్థాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. శ్రీలంకపై విజయం సాధించినా.. మెరుగైన రన్రేట్ లేకపోవడంతో పాక్ ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ గత నాలుగు టీ20 వరల్డ్ కప్ల ప్రదర్శనను పరిశీలిస్తే కెప్టెన్సీ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా బాబర్ అజమ్ కెప్టెన్గా ఉన్నప్పుడు పాక్ స్థిరమైన ప్రదర్శన చేయగా.. సల్మాన్ అలీ అఘా నాయకత్వంలో దారుణ ప్రదర్శన చేసింది. దాంతో కెప్టెన్సీ మార్పుకు కారణమైన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నక్వీపై పాక్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. జిత్తుల మారి ‘నక్వీ’ కారణంగానే పాక్ ఓటములను ఎదుర్కొంటోందని కామెంట్స్ చేస్తున్నారు.
బాబర్ అజమ్ నాయకత్వంలో పాకిస్థాన్ 2021 టీ20 వరల్డ్ కప్లో సెమీఫైనల్ వరకు దూసుకెళ్లింది. ఆ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో ఓడిపోయినా.. జట్టు ప్రదర్శన బాగుంది. 2022లో అయితే ఫైనల్ చేరింది. ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్లో ఓటమి పాలైనా.. వరుసగా రెండు వరల్డ్ కప్ల్లో నాకౌట్ దశకు చేరడం బాబర్ కెప్టెన్సీ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అయితే 2024 వరల్డ్ కప్లో భారత్, అమెరికా చేతిలో ఓడి గ్రూప్ దశలోనే నిష్క్రమించడం బాబర్ కెరీర్లో మచ్చగా మిగిలింది.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
- RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
ఇక 2026 టీ20 వరల్డ్ కప్లో పాక్ కొత్త కెప్టెన్ సల్మాన్ అలీ అఘా నేతృత్వంలో బరిలోకి దిగింది. లీగ్ దశలో టీమిండియాపై ఓటమిని ఎదుర్కొంది. సూపర్-8 దశకు చేరినా.. శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లతో పోరాటం జట్టుకు కఠిన సవాలుగా మారింది. ఫలితంగా పాక్ సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. దాంతో పాక్ ప్రదర్శనపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబర్ అజమ్ హయాంలో పాక్ వరుసగా సెమీస్, ఫైనల్ చేరిందని… అయినా ఎందుకు కెప్టెన్సీ మార్పు చేశారన్న చర్చ మొదలైంది. సల్మాన్ ఆఘాను కెప్టెన్గా కొనసాగించడంపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీపై అభిమానులు, విశ్లేషకులు మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!