Pakistan Trolls: మార్పు అవసరమా?.. జిత్తుల మారి ‘నక్వీ’ కారణంగానే పాకిస్థాన్ ఓటములు!
- టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి పాకిస్థాన్ నిష్క్రమణ
- మరోసారి హాట్ టాపిక్గా మారిన కెప్టెన్సీ అంశం
- నక్వీ కారణంగానే పాకిస్థాన్ ఓటములు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి పాకిస్థాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. శ్రీలంకపై విజయం సాధించినా.. మెరుగైన రన్రేట్ లేకపోవడంతో పాక్ ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ గత నాలుగు టీ20 వరల్డ్ కప్ల ప్రదర్శనను పరిశీలిస్తే కెప్టెన్సీ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా బాబర్ అజమ్ కెప్టెన్గా ఉన్నప్పుడు పాక్ స్థిరమైన ప్రదర్శన చేయగా.. సల్మాన్ అలీ అఘా నాయకత్వంలో దారుణ ప్రదర్శన చేసింది. దాంతో కెప్టెన్సీ మార్పుకు కారణమైన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నక్వీపై పాక్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. జిత్తుల మారి ‘నక్వీ’ కారణంగానే పాక్ ఓటములను ఎదుర్కొంటోందని కామెంట్స్ చేస్తున్నారు.
బాబర్ అజమ్ నాయకత్వంలో పాకిస్థాన్ 2021 టీ20 వరల్డ్ కప్లో సెమీఫైనల్ వరకు దూసుకెళ్లింది. ఆ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో ఓడిపోయినా.. జట్టు ప్రదర్శన బాగుంది. 2022లో అయితే ఫైనల్ చేరింది. ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్లో ఓటమి పాలైనా.. వరుసగా రెండు వరల్డ్ కప్ల్లో నాకౌట్ దశకు చేరడం బాబర్ కెప్టెన్సీ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అయితే 2024 వరల్డ్ కప్లో భారత్, అమెరికా చేతిలో ఓడి గ్రూప్ దశలోనే నిష్క్రమించడం బాబర్ కెరీర్లో మచ్చగా మిగిలింది.
Also Read
- Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
- BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
- India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
ఇక 2026 టీ20 వరల్డ్ కప్లో పాక్ కొత్త కెప్టెన్ సల్మాన్ అలీ అఘా నేతృత్వంలో బరిలోకి దిగింది. లీగ్ దశలో టీమిండియాపై ఓటమిని ఎదుర్కొంది. సూపర్-8 దశకు చేరినా.. శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లతో పోరాటం జట్టుకు కఠిన సవాలుగా మారింది. ఫలితంగా పాక్ సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. దాంతో పాక్ ప్రదర్శనపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబర్ అజమ్ హయాంలో పాక్ వరుసగా సెమీస్, ఫైనల్ చేరిందని… అయినా ఎందుకు కెప్టెన్సీ మార్పు చేశారన్న చర్చ మొదలైంది. సల్మాన్ ఆఘాను కెప్టెన్గా కొనసాగించడంపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీపై అభిమానులు, విశ్లేషకులు మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!