వేడెక్కుతున్న గోవా… ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న పార్టీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో నాలుగు నెలల్లో గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీలు చూస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న బీజేపీ ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకొని మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నది. అయితే, దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ప్రభావం ఈ ఎన్నికలపై కనిపించే అవకాశం ఉన్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటుగా ఈసారి గోవా నుంచి తృణమూల్, ఆప్ పార్టీలు కూడా బరిలోకి దిగబోతున్నాయి. ఇప్పటికు తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడు రోజులపాటు గోవాలో పర్యటించారు. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు సంధించారు. గోవాలో మాత్రమే కాకుండా నార్త్లో అన్ని రాష్ట్రాల్లో ఇకపై పోటీ చేయబోతున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించారు. రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయాలు, కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాల కారణంగానే మోడీ మరింత బలంగా మారుతున్నారని, కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని అందుకు తాము రంగంలోకి దిగుతున్నామని మమతా బెనర్జీ ప్రకటించారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా గోవా ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గోవాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే గోవా ఎన్నికల మ్యానిఫెస్టోను రిలీజ్ చేసి ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
Read: భార్య కోసం భర్త త్యాగం… కోరుకున్నవాడికి ఇచ్చి….
Also Read
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
- TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
- Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు
- Tags
- AAP
- bjp
- congress
- Goa
- goa elections
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం