AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్రానికి మరో రెండు ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రులను మంజూరు చేయాలని జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం సేవలందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్ను పూర్తిస్థాయి జాతీయ స్థాయి అత్యాధునిక వైద్య సంస్థగా అభివృద్ధి చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి. నడ్డాకు ఎంపీ లింగమనేని వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని దాదాపు ఐదు కోట్ల జనాభాకు ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క ఎయిమ్స్ సరిపోవడం లేదని లేఖలో పేర్కొన్నారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కావాలంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒక్కో ఎయిమ్స్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ లింగమనేని లేఖలో వివరించారు. గతంలో జమ్మూ కశ్మీర్, బిహార్ వంటి రాష్ట్రాలకు ఒకటికి మించి ఎయిమ్స్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. అదే ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్కూ మరో రెండు ఎయిమ్స్లను కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. దీంతో రాష్ట్రంలోని ప్రాంతీయ అసమానతలు తగ్గడంతో పాటు అధునాతన వైద్య సేవలు ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
అలాగే ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ను అన్ని రంగాల్లో మరింత బలోపేతం చేయాలని లింగమనేని రమేశ్ సూచించారు. ముఖ్యంగా క్యాన్సర్, న్యూరోసైన్సెస్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, అడ్వాన్స్డ్ కార్డియాక్ కేర్ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలను విస్తరించాలని కోరారు. ఈ విభాగాలకు అవసరమైన ఆధునిక వైద్య పరికరాలతో పాటు మరిన్ని పడకలు, వైద్యులు, సిబ్బందిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలంటే ఎయిమ్స్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కొత్త వైద్య సంస్థలను ఏర్పాటు చేయడం అత్యవసరమని ఎంపీ తన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి.. ఆంధ్రప్రదేశ్కు మరిన్ని ఎయిమ్స్లను మంజూరు చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..