సోము వీర్రాజును పిచ్చి కుక్క కరిచింది.. బీజేపీ ఏమైనా చేసిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు… మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఆగ్రహ సభలో ప్రసంగించిన ఆయన.. కమ్యూనిస్టులు నీచులని, యూనియన్లతో వ్యవస్థల్ని నాశనం చేశారని మండిపడ్డారు. ఇక, కమ్యూనిస్టులు మొరిగే కుక్కలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అయితే, అదే స్థాయిలో కమ్యూనిస్టులు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.. సోము వీర్రాజును పిచ్చి కుక్క కరిచిందని వ్యాఖ్యానించారు పి. మధు.. బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు.. అసలు ప్రజలు ఉపయోగపడే పని ఏమైనా చేశారా? అని నిలదీశారు.
ఇక, రైతుల కోసం బీజేపీ ఏమైనా చేసిందా..? అని ప్రశ్నించారు పి. మధు.. బీజేపీకి మతోన్మాదమే తప్ప.. దేశభక్తి లేనేలేదన్న ఆయన.. స్వాతంత్ర్యానికి ముందు జస్టిస్ పార్టీలో ఉండి బ్రిటీషర్లకు మద్దతు పలికింది ఈ బీజేపీనే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. కానీ, మేం అలా కాదు.. మేమే నిజమైన దేశ భక్తులం అని స్పష్టం చేశారు పి. మధు. మరోవైపు సీపీఐ నేత రామకృష్ణ కూడా సోము వీర్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాష్ట్ర ప్రజలు మద్య నిషేధం కోరుతుంటే.. బీజేపీ మాత్రం మద్యం ఏరులుగా పారిస్తానంటోంది అని.. కోటి మంది మందుబాబులు ఉన్నారని.. వారంతా బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పడంతో.. సోము వీర్రాజుకు పిచ్చి పరాకాష్టకు చేరిందని.. ఆయన సోము వీర్రాజు కాదు.. సారాయి వీర్రాజు అంటూ మండిపడ్డారు రామకృష్ణ.
Also Read
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!