Vemula Prashanth Reddy: రేవంత్ది ప్రజాపాలన కాదు.. ప్రతి పక్షాలపై పంజా విసిరే పాలన
- రేవంత్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను బుల్డోజ్ సమావేశాలుగా మార్చింది..
- ఈ రోజు వయనాడ్కు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎందుకు పంపుతున్నారు రేవంత్ రెడ్డి..
- జాబ్ క్యాలెండర్పై ఊదరగొట్టి అసెంబ్లీలో ఏం చేశారు..?: వేముల ప్రశాంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vemula Prashanth Reddy: రేవంత్ ప్రభుత్వం ఆసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బుల్డోజ్ సమావేశాలుగా మార్చింది అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయం ఒక్క రోజే పెట్టారు.. జీరో అవర్ మొత్తానికే ఎత్తేశారు.. సభలో ప్రతి పక్షాల గొంతు నొక్కారు అని పేర్కొన్నారు. డిమాండ్లపై రెండు రోజులే చర్చ జరిపారు.. ఆర్ అండ్ బీ పద్దులపై మాట్లాడే అవకాశం రాలేదు.. ద్రవ్య వినిమయ బిల్లు పూర్తి స్థాయి చర్చ లేకుండా ఆమోదించుకున్నారు.. అసలు విప్పులు ప్రతిపక్ష సభ్యులతో మాట్లాడిందే లేదు అని ఆయన అన్నారు. రేవంత్ ది ప్రజా పాలన కాదు ప్రతి పక్షాలపై పంజా విసిరే పాలన అని
ఈ బడ్జెట్ సమావేశాలు నీరూపించాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీని అథమ స్థాయికి తీసుకెళ్లారు.. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే పెన్షన్లు 15రోజులు లేట్ అయితే తప్పేమిటన్నారు.. విద్యుత్ అరగంట పొతే తప్పేమిటంటున్నారు అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Wayanad landslides: రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొన్న మోహన్లాల్..
Also Read
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
ఇక, మరో కాంగ్రెస్ సభ్యుడు వీఆర్ఓ, వీఆర్ఏలు లంచాలు తీసుకుంటే తప్పేమిటని అంటున్నారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ద్రవ్య వినిమయ బిల్లుపై వాస్తవాలు చెబుతుంటే.. సీఎం జోక్యం చేసుకుని అనవసరంగా మహిళా ఎమ్మెల్యేలను దూషించి కంటతడి పెట్టించారు అని మండిపడ్డారు. నాలుగున్నర గంటలుగా మహిళ ఎమ్మెల్యేలు బతిమిలాడినా మైక్ దొరక లేదు.. సీఎం రేవంత్ తన ఆడంబరాలు, అబద్ధాలకు అసెంబ్లీని వాడుకున్నారు అని ఆయన ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ పై ఊదర గొట్టి అసెంబ్లీలో ఏం చేశారు అని ప్రశ్నించారు. పంజాబ్ రాష్ట్రంలో రైతులకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సాయం చేస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది.. కానీ, ఈ రోజు వయనాడ్ కు ఎందుకు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు పంపుతున్నావ్ రేవంత్ రెడ్డి అంటూ ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు కోయెల్ మల్లిక్ రాజీనామా
-
OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు.. మిషన్ 360పై మోడీ సర్కార్ ఫోకస్..
-
Hair Growth Tips: జుట్టు గుత్తులు గుత్తులుగా రాలిపోతోందా?.. ఈ చిట్కాలు చాలు..
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!