Vemula Prashanth Reddy: రేవంత్ది ప్రజాపాలన కాదు.. ప్రతి పక్షాలపై పంజా విసిరే పాలన
- రేవంత్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను బుల్డోజ్ సమావేశాలుగా మార్చింది..
- ఈ రోజు వయనాడ్కు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎందుకు పంపుతున్నారు రేవంత్ రెడ్డి..
- జాబ్ క్యాలెండర్పై ఊదరగొట్టి అసెంబ్లీలో ఏం చేశారు..?: వేముల ప్రశాంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vemula Prashanth Reddy: రేవంత్ ప్రభుత్వం ఆసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బుల్డోజ్ సమావేశాలుగా మార్చింది అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయం ఒక్క రోజే పెట్టారు.. జీరో అవర్ మొత్తానికే ఎత్తేశారు.. సభలో ప్రతి పక్షాల గొంతు నొక్కారు అని పేర్కొన్నారు. డిమాండ్లపై రెండు రోజులే చర్చ జరిపారు.. ఆర్ అండ్ బీ పద్దులపై మాట్లాడే అవకాశం రాలేదు.. ద్రవ్య వినిమయ బిల్లు పూర్తి స్థాయి చర్చ లేకుండా ఆమోదించుకున్నారు.. అసలు విప్పులు ప్రతిపక్ష సభ్యులతో మాట్లాడిందే లేదు అని ఆయన అన్నారు. రేవంత్ ది ప్రజా పాలన కాదు ప్రతి పక్షాలపై పంజా విసిరే పాలన అని
ఈ బడ్జెట్ సమావేశాలు నీరూపించాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీని అథమ స్థాయికి తీసుకెళ్లారు.. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే పెన్షన్లు 15రోజులు లేట్ అయితే తప్పేమిటన్నారు.. విద్యుత్ అరగంట పొతే తప్పేమిటంటున్నారు అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Wayanad landslides: రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొన్న మోహన్లాల్..
Also Read
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం.. ఎయిర్పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
ఇక, మరో కాంగ్రెస్ సభ్యుడు వీఆర్ఓ, వీఆర్ఏలు లంచాలు తీసుకుంటే తప్పేమిటని అంటున్నారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ద్రవ్య వినిమయ బిల్లుపై వాస్తవాలు చెబుతుంటే.. సీఎం జోక్యం చేసుకుని అనవసరంగా మహిళా ఎమ్మెల్యేలను దూషించి కంటతడి పెట్టించారు అని మండిపడ్డారు. నాలుగున్నర గంటలుగా మహిళ ఎమ్మెల్యేలు బతిమిలాడినా మైక్ దొరక లేదు.. సీఎం రేవంత్ తన ఆడంబరాలు, అబద్ధాలకు అసెంబ్లీని వాడుకున్నారు అని ఆయన ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ పై ఊదర గొట్టి అసెంబ్లీలో ఏం చేశారు అని ప్రశ్నించారు. పంజాబ్ రాష్ట్రంలో రైతులకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సాయం చేస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది.. కానీ, ఈ రోజు వయనాడ్ కు ఎందుకు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు పంపుతున్నావ్ రేవంత్ రెడ్డి అంటూ ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!