Wayanad landslides: రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొన్న మోహన్లాల్..
- కేరళలోని వాయనాడ్లో కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య శనివారం నాటికి 358కి చేరుకుంది.
- మలయాళ చిత్ర పరిశ్రమ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఈరోజు వాయనాడ్ చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు.
- మోహన్లాల్ టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్.
Wayanad landslides: కేరళలోని వాయనాడ్లో కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య శనివారం నాటికి 358కి చేరుకుంది. శిథిలాల కింద, కూలిన ఇళ్ల కింద చిక్కుకున్న వ్యక్తుల కోసం రెస్క్యూ బృందాలు డీప్ సెర్చ్ రాడార్ ను ఉపయోగిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్లో సహాయం చేయడానికి డీప్ సెర్చ్ రాడార్ను పంపాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. నార్తర్న్ కమాండ్ నుండి ఒక జావర్ రాడార్, ఢిల్లీలోని త్రిరంగ మౌంటైన్ రెస్క్యూ ఆర్గనైజేషన్ నుండి నాలుగు రీకో రాడార్ లను శనివారం వైమానిక దళం విమానంలో వాయనాడ్ కు తీసుకువెళ్లింది.
LB Nagar Crime: బట్టలు ఆరేసే విషయంలో మహిళల మధ్య గొడవ.. కత్తితో దాడి..
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
సెర్చ్ అండ్ రెస్క్యూలో ప్రత్యేకత కలిగిన ప్రైవేట్ కంపెనీలు, కొందరు వాలంటీర్లు కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ఇండియన్ ఆర్మీ, కేరళ పోలీస్, ఎమర్జెన్సీ సర్వీసెస్ విభాగాలు రెస్క్యూ టీమ్కు నాయకత్వం వహిస్తున్నాయి. 1,300 మందికి పైగా రెస్క్యూ వర్కర్లు ధ్వంసమైన భవనాలు, శిధిలాల క్రింద భారీ యంత్రాలు, అత్యాధునిక పరికరాలతో ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతకడానికి తీవ్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
America: యూఎస్ లో సత్యనారాయణస్వామి వ్రతం..ఇంగ్లీష్ లో కథ చెప్పిన పూజారి..వీడియో వైరల్
మలయాళ చిత్ర పరిశ్రమ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఈరోజు వాయనాడ్ చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. మోహన్లాల్ టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్. సైనిక శిబిరానికి చేరుకున్న ఆయన సహాయక చర్యలకు నాయకత్వం వహిస్తున్న అధికారులతో మాట్లాడారు. విపత్తు తీవ్రతను ప్రత్యక్షంగా చూస్తేనే అర్థమవుతుందని అన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, NDRF, అగ్నిమాపక, పోలీసు విభాగాలు రెస్క్యూ ఆపరేషన్లో భాగమైన స్థానిక ప్రజలు అద్భుతమైన పని చేసారు. ఇక మరోవైపు డీఎన్ఏ, డెంటల్ శాంపిల్స్ తీసుకున్న తర్వాతే మృతదేహాలను దహనం చేయాలని కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి మృతదేహం లేదా అవశేషాలకు గుర్తింపు సంఖ్యను కేటాయించాలి. గుర్తింపు సాధ్యం కాకపోతే, 72 గంటల విచారణ తర్వాత తదుపరి చర్య కోసం మృతదేహాన్ని జిల్లా యంత్రాంగానికి అప్పగించాల్సి ఉంటుంది. కాగా, కల్పత్తా పబ్లిక్ శ్మశానవాటికలో మూడు గుర్తుతెలియని మృతదేహాలను దహనం చేశారు. వాయనాడ్ కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో మృతదేహాలను కాల్చడం లేదా ఖననం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దహన సంస్కారాలు జరిగాయి.
లెఫ్టినెంట్ హోదాలో 'వాయనాడ్' సహాయక చర్యల్లో పాల్గొన్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్..#MohanLal #WayanadLandslide #WayanadTragedy #Kerala #keralaflood #WayanadDisaster #NTVTelugu pic.twitter.com/C6IdicuP1A
— NTV Telugu (@NtvTeluguLive) August 3, 2024
#WATCH | Actor Mohanlal who is a Lieutenant Colonel in the Territorial Army, reached the landslide-hit Mundakkai area in Wayanad.#Kerala pic.twitter.com/feEpYNZa5B
— ANI (@ANI) August 3, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!