V Hanumantha Rao: రేవంత్ రెడ్డిపై దాడిని ఖండించిన వీహెచ్.. సీరియస్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V Hanumantha Rao Mallu Ravi Condemns Attack On Revanth Reddy: నిన్న రాత్రి భూపాలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై జరిగిన దాడిని (టమోటా, కోడిగుడ్లతో ఎటాక్) కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఖండించారు. రేవంత్పై కోడిగుడ్లు వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాళ్లు, గుడ్లు కొట్టడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక రాచరికమా? అని ప్రశ్నించారు. దాడులు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. సీఎం కేసీఆర్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడం కోసమే ఈ దాడులు చేశారని ఆరోపించారు. ఏపీలో బీఆర్ఎస్ సభ పెడితే, అక్కడ కూడా ఇలాగే చేయమంటారా? అని అడిగారు.
Indian Shot Dead: ఆస్ట్రేలియాలో దారుణం.. పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
మీ ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టుకోవాల్సిందిగా కేసీఆర్ను వీహెచ్ సూచించారు. తమపై రాళ్లు కొడితే.. ఏపీలో మీకూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. ‘‘జాతీయ నాయకుడు అవుతానని అంటున్నావు.. ఇదేనా మీ విధానం?’’ అని ప్రశ్నించారు. అందరూ ఇదే ఆలోచన చేస్తే.. ఎవ్వరూ మీటింగ్ పెట్టలేరని పేర్కొన్నారు. దాడులు రిపీట్ అయితే, అందుకు సమాధానం సీరియస్గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య ఘటనపై వీహెచ్ మాట్లాడారు. ఈ ఘటన దారుణమని, విద్యార్థుల పట్ల కాలేజీ యాజమాన్యం సున్నితంగా వ్యవహరించాలని అన్నారు. హర్ట్ అయితే విద్యార్థులు ఆహత్యలకు పాల్పడుతున్నారని, దీన్ని గమనించి కాలేజీ యాజమాన్యాలు నడుచుకోవాలని చెప్పారు.
Student Sathvik Case: సాత్విక్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు.. అదుపులో ఆ నలుగురు
టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి కూడా ఈ ఘటనపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు. దాడులు చేస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. భూపాలపల్లిలో రేవంత్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ఒక వ్యక్తిపైన జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీ చేసిన ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడే హక్కు ఉందని అన్నారు. భౌతిక దాడులు చేస్తే మాట్లాడడం మనుకుంటామని బీఆర్ఎస్ నాయకులు అనుకోవడం వారి భ్రమ అని చెప్పారు.
తాజావార్తలు
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
-
Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!