Student Sathvik Case: సాత్విక్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు.. అదుపులో ఆ నలుగురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Case Filed On Sri Chaitanya College Sathvik Suicide Incident: శ్రీ చైతన్య కాలేజీ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య ఘటనపై కాలేజీ సిబ్బంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. 305 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఏపీసీ రమణ గౌడ్ స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పలు విద్యార్థుల నుండి సేకరించామని, విద్యార్థుల తల్లిదండ్రులతోనూ కాలేజీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. విద్యార్థులను కొడుతున్న వీడియోలు కూడా ఉన్నాయని, వాటిని ఆధారాలుగా తీసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు.. శ్రీచైతన్య ఏజీఎం స్వామి మాట్లాడుతూ, ఈ ఘటనపై తాము అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారని.. ఆచార్య, క్రిష్ణారెడ్డి, నరేశ్, జగన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అన్నారు. సాత్విక్ను ఆచార్య కొడుతున్నాడన్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను కొడుతున్నట్టు నిజమని తేలితే, వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
Kidney For Sale: భరణం కోసం భార్య వేధింపులు.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త
Also Read
ఇదిలావుండగా.. హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజ్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎన్. సాత్విక్ తన క్లాస్రూమ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 10:30 సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉపాధ్యాయులు తనని ‘ఫెయిల్యూర్ ఫెయిల్యూర్’ అంటూ వేధింపులకు గురి చేయడంతో పాటు నిత్యం కొడుతుండటం వల్ల.. సాత్విక్ మానసికంగా కుంగిపోయాడు. ఆ డిప్రెషన్లోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. దారుణమైన విషయం ఏమిటంటే.. సాత్విక్ ఉరివేసుకున్న విషయాన్ని గమనించిన విద్యార్థులు, అతడ్ని ఆసుపత్రికి తరలించేందుకు సహకరించాలని సిబ్బందిని కోరినా పట్టించుకోలేదు. దీంతో.. స్నేహితులే అతడ్ని బయట వెహికల్ లిఫ్ట్ అడిగి, ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆలోపే అతడు తుదిశ్వాస విడిచాడు. బాగా చదివి ఇంటికి పెద్దదిక్కు అవుతాడనుకున్న కొడుకు, ఇలా విగతజీవిగా మారడం చూసి తల్లిదండ్రులు రోదిస్తున్నారు. గతంలో లెక్చరర్స్ కొట్టడం వల్ల తమ కుమారుడు 15 రోజులపాటు ఆసుపత్రి పాలయ్యాడని, ఇప్పుడు తమ అబ్బాయి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణమని ఫిర్యాదు చేశారు.
Myanmar Woman Molested: ఢిల్లీలో దారుణం.. మయన్మార్కు చెందిన మహిళపై సామూహిక అత్యాచారం
మరోవైపు.. సాత్విక్ ఆత్మహత్య వార్త విని విద్యార్థులు శ్రీ చైతన్య కాలేజీ వద్ద రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేశారు. కుటుంబ సభ్యులు సైతం వారితో కలిసి బైఠాయించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. విద్యార్థులను కాలేజీ క్యాంపస్ లోపలికి నెట్టేశారు. ఈ క్రమంలో అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు.. ఈ ఘటనపై ఇంటర్ విద్య కమిషనర్తో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. సాత్విక్ మృతిపై విచారణ చేసి, వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. బాద్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.
తాజావార్తలు
-
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
-
Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
-
Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2026 Playoffs Scenario: కేకేఆర్ సెన్సేషనల్ విక్టరీ.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..