CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరుల పెంపు, బడ్జెట్ లక్ష్యాల సాధనపై సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని MCRHRDలో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారులు రామకృష్ణారావు మరికొందరు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బడ్జెట్కు అనుగుణంగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలంటే ఆదాయ సమీకరణపై అన్ని శాఖలు మరింత సీరియస్గా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ముఖ్యంగా HMDA, TGIIC, కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్ శాఖలతో పాటు ఆదాయ వనరులకు సంబంధించిన అన్ని విభాగాల్లో ఎలాంటి లీకేజీలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదాయ వసూళ్లను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా “చేజింగ్ సెల్” ఏర్పాటు చేసి.. పెండింగ్ అంశాలపై నిరంతరం ఫాలోఅప్ చేయాలని అధికారులకు సూచించారు. శాఖల వారీగా సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా మాత్రమే ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచాలని సీఎం సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి లబ్ధిదారుల జాబితాలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) వ్యవస్థతో అనుసంధానం చేయాలని చెప్పారు. దీంతో పారదర్శకత పెరగడంతో పాటు నిధుల వినియోగంలో సమర్థత సాధ్యమవుతుందని అన్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన జరగాలని సీఎం స్పష్టం చేశారు. భూసేకరణను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని, అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు.
ఊహాజనిత అంచనాల ఆధారంగా కాకుండా వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ రూపొందించాలని అధికారులకు సూచించిన సీఎం, వివిధ శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో ఇకపై ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!