Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaggareddy: అయోధ్య శ్రీరామ మందిరంలో జరిగినట్లు వెలుగులోకి వచ్చిన దొంగతనం ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ మందిరానికి వచ్చే భక్తులు హుండీలో సమర్పించిన డబ్బులు దోచుకుపోయారని ఆరోపిస్తూ.. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటి వరకు స్పందించకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు.
అయోధ్యలోనే కాకుండా ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని గుర్తుచేసిన జగ్గారెడ్డి.. రామ మందిర ట్రస్ట్ వ్యవహారాలు కూడా బీజేపీ నాయకత్వ పరిధిలోనే ఉన్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ ఘటనపై ఎవరూ నోరు విప్పకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీలను పంపించి వివరాలు సేకరించాలని సూచించారని చెప్పారు.
Also Read
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
- Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
- Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
ఇన్నేళ్లుగా బీజేపీ రాముడి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని జగ్గారెడ్డి విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి శ్రీరాముడి పేరు కూడా ఒక కారణమని పేర్కొంటూ.. ఇప్పుడు అదే రాముడి ఆలయంలో జరిగిన ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. శ్రీరాముడిని కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే చూస్తున్నారా అని నిలదీశారు. మహాత్మా గాంధీ కూడా “రఘుపతి రాఘవ రాజారాం” అని చెప్పేవారని.. నెహ్రూ హయాంలో కూడా రాముడి పాలన కొనసాగిందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనను చిన్న విషయంగా కొట్టిపారేయడం సరైంది కాదని, రాముడి గుడిలో దొంగతనం జరగడం అత్యంత తీవ్రమైన అంశమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఇలాంటి ఘటన జరిగి ఉంటే బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలు, కులాలను కలిపే రాజకీయాలు చేస్తుందని.. బీజేపీ మాత్రం కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తుందని జగ్గారెడ్డి ఆరోపించారు. కనీసం ఈ ఘటనపై ప్రధాని మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. కేటీఆర్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారని, అందుకే విమర్శలు చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్ర పాలనలో బిజీగా ఉన్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చడం, సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు నిధుల జమ వంటి పనుల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉందన్నారు.
రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చిందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఉచిత విద్యుత్ వంటి హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. కేటీఆర్ ఎన్ని విమర్శలు చేసినా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కొనసాగుతారని, ఆ వాస్తవాన్ని ఎవరూ మార్చలేరని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్పై ఎన్టీఆర్ ఫోకస్
-
Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
-
Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
-
Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!