V Hanumantha Rao: కాంగ్రెస్లో ఎవరు డబ్బులు తీసుకున్నారో నిరూపించాలి.. వీహెచ్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V Hanumantha Rao Counter Attack On Etela Rajender Reddy: మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ రూ.25 కోట్లు ఇచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు స్పందించారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రూ.25 కోట్లు తీసుకున్నట్టు ఈటెల రాజేందర్, బండి సంజయ్ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తీసుకున్నాడని తాము చెప్పట్లేదని బీజేపీ నేతలు అంటున్నారని.. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ డబ్బులు తీసుకుందని వాళ్లు పేర్కొంటున్నారని.. మరి కాంగ్రెస్లో ఎవరు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ఇలాంటి చెత్త ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మీద అబద్ధపు ప్రచారాలు చేయడం తగునా? అపోహలతో విషప్రచారం చేయడం పద్ధతేనా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని.. అందులో బీఆర్ఎస్ కూడా ఒకటని స్పష్టతనిచ్చారు.
World War II Ship: రెండో ప్రపంచయుద్ధంలో 864 మంది సైనికులతో మునిగిపోయింది.. 84 ఏళ్ల తర్వాత..
Also Read
- Khaja Moizuddin Mur*der: హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.!
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
తమ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోటీ చేస్తుంది కదా.. అది తెలిసి కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం తగునా? అని వీహెచ్ నిలదీశారు. ప్రతి ఎన్నికల్లోనూ సంబంధాలు పెట్టుకునేది మీరని, ఇతరుల మీద రుద్దడం మీకే సాధ్యమని విమర్శించారు. బీఆర్ఎస్తో ఎక్కువ సంబంధాలు మీకే ఉన్నాయని విరుచుకుపడ్డారు. ప్రజల్లో కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టాలని ఉండొచ్చు కానీ ఆ పప్పులు ఉడకవని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. భాగ్యలక్ష్మి దేవాలయాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. దేవుడు కేవలం బీజేపీకే సొంతం కాదని, తమకు కూడా దేవుడేనని పేర్కొన్నారు. తమది సెక్యులర్ విధామని అన్నారు. చీప్ మాటలు మాట్లాడకండని సూచించిన ఆయన.. ఇతర పార్టీలను తరిమేయాలన్నది మీ వ్యూహమని, కానీ అధి సాధ్యం కాదని అన్నారు. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఎప్పటి నుంచో ఉందని.. మరి ఉద్యోగాలు ఇవ్వమని ప్రధాని మోడీని ఎందుకు అడగరని.. అది అడగడం చేత కాదా? అని ఎద్దేవా చేశారు. బీజేపీ వాళ్లు ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. కాంగ్రెస్ జెండా రెపరేపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Anil Kumar Eravathri: ఈటలకు స్ట్రాంగ్ వార్నింగ్.. రేవంత్ జోలికొస్తే నాలుక కోస్తారు జాగ్రత్త
తాజావార్తలు
-
Yash Dayal-RCB: ఆర్సీబీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో.. చాలా బాధగా ఉంది.. యశ్ దయాల్ సంచలన వ్యాఖ్యలు!
-
Chennai Love Story: ఎంఎం కీరవాణి చేతుల మీదుగా “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి ‘వదలనే..’ పాట విడుదల
-
Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
-
IPL 2026: ఒకే ఒక్క మ్యాచ్లో హీరోలు.. ఆ తర్వాత పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిన 5 గురు ‘వన్ మ్యాచ్ వండర్స్’!
-
Arshdeep Singh: భారీ షాకిచ్చిన అర్ష్దీప్ సింగ్.. విరాట్ కోహ్లీ వైరల్ వీడియో కూడా డిలీట్!
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!