Anil Kumar Eravathri: ఈటలకు స్ట్రాంగ్ వార్నింగ్.. రేవంత్ జోలికొస్తే నాలుక కోస్తారు జాగ్రత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Kumar Eravathri Gives Strong Counter To Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు మాజీ విప్ ఈరవత్రి అనిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గురించి ఇంకోసారి మాట్లాడితే.. కాంగ్రెస్ శ్రేణులు మీ నాలుకలు కోస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఈటెల ఒక అవినీతి పరుడు, ఒక స్వార్థపరుడు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారని ఈటెల అంటున్నారని.. ఆయన ప్రజల కోసం కొట్లాడితే, ప్రభుత్వం జైలుకు పంపిందని స్పష్టతనిచ్చారు. జాన్వాడ ఫామ్ హౌస్ భూముల విషయంలో కొట్లాడితే.. రేవంత్ రెడ్డిని మంత్రి కేటీఆర్ 16 రోజులు జైల్లో వేశారని.. అప్పుడు ఈటల కూడా మంత్రివర్గంలో ఉన్నారని గుర్తు చేశారు.
RCB vs RR: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. రాజస్థాన్ లక్ష్యం ఎంతో తెలుసా?
Also Read
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ఈటల బీసీ అని చెప్పుకుంటారని.. కానీ ఆయన పట్టాదారు పాసు పుస్తకంలో మాత్రం రాజేందర్ రెడ్డి అని ఉందని.. మరి నువ్వు రెడ్డివా, బీసీవా నువ్వే చెప్పాలని అడిగారు. ఈటల ఫైనాన్స్ మిసిస్టర్గా ఉన్న సమయంలోనే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో సంతకాలు పెట్టి నిధులు విడుదల చేశారని.. అలాంటప్పుడు అవినీతిలో నీ భాగస్వామ్యం లేదా? అని ఈరవత్రి అనిల్ ప్రశ్నించారు. ఉప ఎన్నికలన్నింటిలోనూ నిధులు అడ్డగోలుగా ఖర్చు చేశారని.. అవి ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ఈటల సివిల్ సప్లై మంత్రిగా ఉన్నప్పుడు బియ్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. మక్కల కుంభకోణంలో, ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతిలో నీ వాటాలెంత? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వంలో జరిగిన అన్ని అవినీతి బాగోతాలు నీకు తెలుసు కదా.. మరి కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు.
Animal: ఇదేందయ్యా.. ఇది.. సినిమా చూడాలంటే వారి పర్మిషన్ కావాలా..?
అంతకుముందు.. కేసీఆర్తో ఒప్పందంలో భాగంగానే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని ఈరవత్రి అనిల్ పేర్కొన్నారు. వారిద్దరి మధ్య మంచి అవగాహన ఉందని, కాంగ్రెస్ బలం తగ్గించేందుకు వాళ్లిద్దరు కలిసి వ్యూహం పన్నారని విమర్శించారు. ఒప్పందంలో భాగంగానే హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటలపై కేసీఆర్ బలహీన వ్యక్తిని పోటీకి దించారన్నారు. కాగా.. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ రూ.25 కోట్లు ఇచ్చిందని.. ఆ రెండు పార్టీలూ ఒకటేనని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అందుకు కౌంటర్గానే ఈరవత్రి అనిల్ పై విధంగా స్పందించారు.
తాజావార్తలు
-
Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
-
బీచ్ లో స్థానిక ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన Sanju Samson.. వీడియో వైరల్
-
Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!
-
SRH Lowest Score: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు.. 86 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ..
-
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!