Yadadri: కోర్టులో ఆస్తి వివాదం.. మూడు రోజులుగా మార్చురీలోనే భర్త మృతదేహం
- అంత్యక్రియలు చేసేది లేదని భీష్మించిన భార్య
- కోర్టులో ఆస్తి కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్
- యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగిలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadadri: నేటి సమాజంలో ఆస్తులకు ఇచ్చే విలువ అనుబంధాలకు ఇవ్వడం లేదు. రక్త సంబంధీకుల కంటే ఆస్తిపాస్తులే ప్రధానం అవుతున్న రోజులివి. ఇప్పుడున్న బంధాలన్నీ ఆర్థిక బంధాలతోనే ముడిపడి ఉన్నయని మరోసారి రుజువైంది. తండ్రి ఆస్తి కోసం కోర్టుకెక్కిన ఇద్దరు చెల్లెళ్లు, సోదరుడి వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని, ఆ కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని భార్య, బంధువులు తేల్చి చెప్పారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో చోటుచేసుకుది. మూడు రోజుల క్రితం ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న హనుమంత రెడ్డి అత్యక్రియలు ఇప్పటి వరకు చేయకపోవడంపై స్థానికంగా కలకలం రేపింది. దీనికి గల కారణం ఆస్తి వివాదమనే తేలింది. ఆ కేసును విరమించుకుంటేనే అంత్యక్రియలు చేస్తానని మృతుడి భార్య భీష్మించుకుని కూర్చుంది. దీంతో మూడు రోజులుగా అంత్యక్రియలకు నోచుకోక మృతదేహం మార్చులోనే పడివుంది.
Read also: Chandrababu Naidu: ఏపీ రాజధానిగా అమరావతే.. ఆర్థిక రాజధానిగా విశాఖ..!
Also Read
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
- OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగికి చెందిన చీరిక హనుమంత రెడ్డి హైదరాబాద్లో ప్రైవేట్ బస్సు డ్రైవర్గా పనిచేస్తూ… అక్కడే అద్దె ఇంట్లో ఉంటున్నాడు. హనుమంతరెడ్డి తండ్రి నర్సిరెడ్డికి 7.24 ఎకరాల భూమి ఉంది. పోస్ట్ మాస్టర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన నర్సిరెడ్డి వ్యక్తిగత కారణాలతో మూడేళ్ల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఆస్తిలో వాటా కావాలని హనుమంత రెడ్డి తోబుట్టువులు కోర్టును ఆశ్రయించారు. హనుమంత రెడ్డికి అతని తమ్ముడు కరుణాకర్ రెడ్డితో ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా మానసిక వేదనకు గురైన హనుమంత రెడ్డి శనివారం రాత్రి పంతంగిలోని తన ఇంటికి వచ్చి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఇరుగుపొరుగు వారు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Read also: NBK 109 : సెట్ లో బాలయ్య, నేను సరదాగా ప్రాంక్ చేస్తుంటాం : చాందిని చౌదరి
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే తన భర్త మృతికి ఆడపడుచులు, మరిదే కారణమని హనుమంతరెడ్డి భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దీంతో భయపడిన ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు గ్రామ పెద్దలు, బంధువుల ద్వారా హనుమంతరెడ్డి భార్యపై కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఆస్తిపై కోర్టులో ఉన్న కేసు ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని హనుమంతరెడ్డి భార్య స్వప్న, బంధువులు బెదిరించారు. ఆదివారం, సోమవారాల్లో అతని సోదరుడు, సోదరితో బంధువులు చర్చించారు. కేసు ఉపసంహరణకు అంగీకరించినా.. సోమవారంతో కోర్టు సమయం ముగియడంతో అది సాధ్యం కాలేదు. మంగళవారం కేసు ఉపసంహరించుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Chandrababu Naidu: ఏపీ రాజధానిగా అమరావతే.. ఆర్థిక రాజధానిగా విశాఖ..!
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!