Yadadri: కోర్టులో ఆస్తి వివాదం.. మూడు రోజులుగా మార్చురీలోనే భర్త మృతదేహం
- అంత్యక్రియలు చేసేది లేదని భీష్మించిన భార్య
- కోర్టులో ఆస్తి కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్
- యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగిలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadadri: నేటి సమాజంలో ఆస్తులకు ఇచ్చే విలువ అనుబంధాలకు ఇవ్వడం లేదు. రక్త సంబంధీకుల కంటే ఆస్తిపాస్తులే ప్రధానం అవుతున్న రోజులివి. ఇప్పుడున్న బంధాలన్నీ ఆర్థిక బంధాలతోనే ముడిపడి ఉన్నయని మరోసారి రుజువైంది. తండ్రి ఆస్తి కోసం కోర్టుకెక్కిన ఇద్దరు చెల్లెళ్లు, సోదరుడి వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని, ఆ కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని భార్య, బంధువులు తేల్చి చెప్పారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో చోటుచేసుకుది. మూడు రోజుల క్రితం ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న హనుమంత రెడ్డి అత్యక్రియలు ఇప్పటి వరకు చేయకపోవడంపై స్థానికంగా కలకలం రేపింది. దీనికి గల కారణం ఆస్తి వివాదమనే తేలింది. ఆ కేసును విరమించుకుంటేనే అంత్యక్రియలు చేస్తానని మృతుడి భార్య భీష్మించుకుని కూర్చుంది. దీంతో మూడు రోజులుగా అంత్యక్రియలకు నోచుకోక మృతదేహం మార్చులోనే పడివుంది.
Read also: Chandrababu Naidu: ఏపీ రాజధానిగా అమరావతే.. ఆర్థిక రాజధానిగా విశాఖ..!
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగికి చెందిన చీరిక హనుమంత రెడ్డి హైదరాబాద్లో ప్రైవేట్ బస్సు డ్రైవర్గా పనిచేస్తూ… అక్కడే అద్దె ఇంట్లో ఉంటున్నాడు. హనుమంతరెడ్డి తండ్రి నర్సిరెడ్డికి 7.24 ఎకరాల భూమి ఉంది. పోస్ట్ మాస్టర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన నర్సిరెడ్డి వ్యక్తిగత కారణాలతో మూడేళ్ల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఆస్తిలో వాటా కావాలని హనుమంత రెడ్డి తోబుట్టువులు కోర్టును ఆశ్రయించారు. హనుమంత రెడ్డికి అతని తమ్ముడు కరుణాకర్ రెడ్డితో ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా మానసిక వేదనకు గురైన హనుమంత రెడ్డి శనివారం రాత్రి పంతంగిలోని తన ఇంటికి వచ్చి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఇరుగుపొరుగు వారు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Read also: NBK 109 : సెట్ లో బాలయ్య, నేను సరదాగా ప్రాంక్ చేస్తుంటాం : చాందిని చౌదరి
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే తన భర్త మృతికి ఆడపడుచులు, మరిదే కారణమని హనుమంతరెడ్డి భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దీంతో భయపడిన ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు గ్రామ పెద్దలు, బంధువుల ద్వారా హనుమంతరెడ్డి భార్యపై కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఆస్తిపై కోర్టులో ఉన్న కేసు ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని హనుమంతరెడ్డి భార్య స్వప్న, బంధువులు బెదిరించారు. ఆదివారం, సోమవారాల్లో అతని సోదరుడు, సోదరితో బంధువులు చర్చించారు. కేసు ఉపసంహరణకు అంగీకరించినా.. సోమవారంతో కోర్టు సమయం ముగియడంతో అది సాధ్యం కాలేదు. మంగళవారం కేసు ఉపసంహరించుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Chandrababu Naidu: ఏపీ రాజధానిగా అమరావతే.. ఆర్థిక రాజధానిగా విశాఖ..!
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!