Group-1 Exam: విజయవంతంగా TSPSC గ్రూప్-I ప్రిలిమ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group-1 Prelims Exam Successfully: రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్-1 సర్వీసుల ప్రాథమిక పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. రెండు నెలల్లోపు ఫలితాలను ప్రకటిస్తామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,86,051 మంది అంటే 75 శాతం మంది రాష్ట్రవ్యాప్తంగా 1,019 పరీక్షా కేంద్రాల్లో రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 1,019 పరీక్షా కేంద్రాలలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు 150 నిమిషాల పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. అభ్యర్థులు చాలా ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 10.15 గంటల తర్వాత కేంద్రంలోకి అనుమతించబోమని TSPSC సూచించినప్పటికీ, కొంతమంది అభ్యర్థులు సకాలంలో చేరుకోలేక పోయారని.. నిర్ణీత సమయానికి చేరుకోలేని వారికి ప్రవేశం నిరాకరించబడిందని ఓ నివేదిక తెలిపింది.
ఎనిమిది పనిదినాల్లో OMR షీట్లను స్కానింగ్ పూర్తి చేస్తుందని, ఆ తర్వాత అవి www.tspsc.gov.in వెబ్సైట్లో హోస్ట్ చేయబడతాయని కమిషన్ పేర్కొంది. ప్రిలిమినరీ కీ విడుదల చేయబడతాయి. “ప్రిలిమినరీ కీని విడుదల చేసిన తర్వాత, కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే మేము స్వీకరిస్తామని తెలిపింది. నిపుణుల కమిటీ తుది కీని నిర్ణయిస్తుంది. అన్నీ సవ్యంగా జరిగితే రెండు నెలల్లోపు ఫలితాలు వెలువడుతాయి’’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
Read also: Poster war in Munugode: అప్పుడు నెగిటివ్.. ఇప్పుడు పాజిటివ్.. మునుగోడులో పోస్టర్ వార్
ఇంతకుముందు, 121 మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్లు, 91 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, 48 కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, 42 డిప్యూటీ కలెక్టర్లు, 41 మున్సిపల్ కమిషనర్ – గ్రేడ్-2 మరియు 40 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లతో సహా 503 గ్రూప్-1 పోస్టులను కమిషన్ నోటిఫై చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విడుదలైన తొలి గ్రూప్-1 సర్వీసెస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇదే. అంతకుముందు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2011 సంవత్సరంలో మొత్తం 312 పోస్టుల కోసం పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
Edible-Oil-Prices: పెరిగిన దిగుమతులు.. తగ్గుతున్న వంట నూనెల ధరలు
తాజావార్తలు
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!