హైదరాబాద్ పాతబస్తీలో క్రిప్టోకరెన్సీ రూపంలో మరో నిండు ప్రాణం బలైంది. వేగంగా డబ్బు సంపాదించాలనే ఆశతో డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులు పెట్టిన ఒక యువకుడు, చివరకు భారీ నష్టాలను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఈ విషాద ఘటన నగరంలో కలకలం రేపింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహమ్మద్ ఖాన్ అనే యువకుడు అధిక లాభాల కోసం క్రిప్టోకరెన్సీలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాడు. అయితే, మార్కెట్ ఒడిదుడుకుల వల్ల అతడు ఆశించిన ఫలితాలు రాకపోగా, పెట్టిన పెట్టుబడి…
Tragedy: హైదరాబాద్లోని కూకట్పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పతంగి ఎగురవేస్తూ ఒక బాలుడు విద్యుత్ షాక్కు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కూకట్పల్లి ప్రాంతంలో ఒక బాలుడు పతంగి ఎగురవేస్తుండగా, అనుకోకుండా ఆ పతంగి దారం (మాంజా) తెగిపోయింది. గాలిలో తేలుతూ వెళ్లిన ఆ పతంగి సమీపంలోని ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై పడింది. అయితే, ఆ పతంగిని తీసుకునే ఆరాటంతో బాలుడు ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లాడు. అక్కడ పతంగిని తీసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్…
హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఒక భారీ చీటింగ్ , మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన కొరడా ఝళిపించింది. ఎం/ఎస్ వివేకానంద్ బీహెచ్ఈఎల్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యాలయాధికారులు , బిల్డర్లు కుమ్మక్కై చేసిన అక్రమాలపై సుదీర్ఘ విచారణ జరిపిన అధికారులు, తాజాగా రూ.16.35 కోట్ల విలువైన ఐదు స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 కింద ఈ చర్యలు తీసుకున్నట్లు ఈడీ…
హైదరాబాద్ కూకట్పల్లిలో నిషేధిత చైనా మాంజా ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. సంగారెడ్డి జిల్లా కాజీపల్లికి చెందిన తండ్రి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బైక్పై కూకట్పల్లికి వస్తుండగా, వివేకానందనగర్ జాతీయ రహదారి వద్ద గాలిపటం దారం (చైనా మాంజా) ఐదేళ్ల చిన్నారి నిష్విక ఆదిత్య మెడకు బలంగా చుట్టుకుంది. ఒక్కసారిగా చిన్నారి కేకలు వేయడంతో తండ్రి బైక్ ఆపి చూసేసరికి, మాంజా కోసుకుపోవడంతో మెడ భాగం నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. Chiranjeevi : పద్మశ్రీ…
రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో (పంజాగుట్ట PS క్రైం నెం. 243/2024) మాజీ మంత్రి హరీష్రావు విచారణ పూర్తయింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ విచారణపై సిట్ అధికారులు తాజాగా స్పష్టతనిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. హరీష్రావును సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం ఆయనను వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. అయితే, ఆయన కుమారుడి ఫ్లైట్ ప్రయాణం ఉన్న కారణంగా విచారణను కొంత ముందస్తుగా ముగించవలసి వచ్చిందని సిట్…
సైబర్ నేరగాళ్లు ఎంతటి వారినైనా బురిడీ కొట్టించగలరని నిరూపించే మరో చేదు సంఘటన వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల ఆశ చూపి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ఒక మాజీ ఐపీఎస్ అధికారి భార్యను, తద్వారా ఆ అధికారిని మోసగించి ఏకంగా రూ. 2.58 కోట్లు కొల్లగొట్టారు. ఈ మోసం ఒక చిన్న వాట్సాప్ సందేశంతో ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో అద్భుతమైన చిట్కాలు ఇస్తామని, తక్కువ సమయంలోనే ఊహించని లాభాలు గడించవచ్చని బాధితురాలికి సందేశం అందింది.…
HYDRAA : హైదరాబాద్ నగరంలో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా (HYDRAA), మియాపూర్ ప్రాంతంలో అత్యంత విలువైన భూమిని కాపాడింది. మియాపూర్ విలేజ్ పరిధిలోని మక్తా మహబూబ్పేటలో సాగుతున్న భారీ కబ్జా యత్నాలను హైడ్రా అధికారులు భగ్నం చేశారు. తాజాగా చేపట్టిన ఈ ఆపరేషన్ ద్వారా సుమారు 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి విలువ 3 వేల కోట్ల రూపాయలకు…
చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి అమానుషమైన, చట్టవిరుద్ధ చర్యలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 18 టీమ్లను ఏర్పాటు చేసి, రైడ్లు నిర్వహించి షాకింగ్ వివరాలను వెలికితీసింది. ఆపరేషన్లో భాగంగా చైల్డ్ పోర్న్ వీడియోలను చూస్తూ, షేర్ చేస్తూ, డౌన్లోడ్ లేదా అప్లోడ్ చేస్తూ ఉన్న 24 మంది యువకులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఎక్కువ మంది నిందితులు హైదరాబాద్కు చెందినవారేనని, అరెస్ట్ అయిన వారి వయస్సు…
HYDRA Gunman: హైడ్రా కమిషనర్ వద్ద గన్మ్యాన్గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ చైతన్య ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. హయత్నగర్లోని తన నివాసంలో గన్తో కాల్చుకుని కృష్ణ చైతన్య ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. భార్యతో కలిసి హయత్నగర్లో నివసిస్తున్న కృష్ణ చైతన్య తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కృష్ణ చైతన్య పరిస్థితి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు…
Duvvada, Madhuri : హాట్ టాపిక్ గా మారిన ఫామ్హౌస్ పార్టీ వివాదంపై దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి స్పందించారు. ఎన్టీవీతో వారు మాట్లాడుతూ.. పార్థు అనే స్నేహితుడి పార్టీకి పిలిస్తే వెళ్లామని, అక్కడ బిజినెస్ ఎక్స్పన్షాన్ గురించి మాత్రమే పార్టీ జరిగిందని వివరించారు. పార్టీలో లిక్కర్ ఉన్న మాట వాస్తవేమనని, కానీ.. పార్టీ నిర్వహించేందుకు లైసెన్స్ తీసుకోలేదని విషయం పోలీసులు వచ్చాక తెలిసిందని దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు. పార్టీకి లైసెన్స్ లేదని తెలియడంతో అక్కడినుంచి వచ్చేసినట్లు…