Poster war in Munugode: అప్పుడు నెగిటివ్.. ఇప్పుడు పాజిటివ్.. మునుగోడులో పోస్టర్ వార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poster war in Munugode: మరోసారి నారాయణపురం మండల కేంద్రంలో పోస్టర్లు వెలిశాయి. గతంలో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు రాగా… తాజాగా బీజేపి పార్టీ తమ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి అనుకూల పోస్టర్లు వెలిసింది. నీ దిక్కారంతోనే మునుగోడు ప్రజల కలలు నెరవేరుతున్నాయని… గట్టుప్పల మండల ఏర్పాటు, నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం.. జరుగుతున్న అభివృద్ధి నీ రాజీనామావల్లే ధన్యవాదాలు అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల వ్యవహారం, పార్టీ మార్పు, ఉప ఎన్నికల్లో బిజెపి ఇస్తున్న హామీలపై గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు వేయగా… ఆ పోస్టర్ లు నియోజకవర్గంలో కలకలం రేపాయి.. తాజాగా రాజగోపాల్ రెడ్డికి అనుకూల పోస్టర్లు వేయడంతో పోస్టర్ల పోరాటం మరో రూపం దాల్చింది.
Read also: Missing Case: కడపలో ఏడో తరగతి విద్యార్థిని మిస్సింగ్.. మూడు రోజులు దాటినా దొరకని ఆచూకీ
Also Read
గత ఐదురోజుల ముందు చండూరులో వెలిసిన పోస్టర్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. చండూరులో రాత్రికి రాత్రి Phone Pay తరహాలో Contract Pe, 18000 కోట్లు transaction కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికు కేటాయించడం జరిగిందని వేల సంఖ్యలో షాపులకు, గోడలకు వెలశాయి. పేసీఎం తరహా Contract Pe అంటూ వెళిసిన పోస్టర్లు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. గత కొంతకాలంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడు పోయాడని విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరాడని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై రాజగోపాల్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. మరి ఈ పోస్టర్లపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Read also: Karimnagar Bear Migration: మళ్లీ ఎలుగు బంటి కలకలం.. భయాందోళనలో శాతావాహన విద్యార్థులు
ఈనెల 15న మునుగోడు ఉప ఎన్నికల్లో పోస్టర్ల వార్ హీట్ పుట్టిస్తోంది. మొన్నటికి మొన్న పేటీఎం తరహాలో పే కాంట్రాక్టర్ అంటూ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వ్యంగ్య పోస్టర్లు మునుగోడు నియోజకవర్గమంతా కలకలం సృష్టించగా మరో తరహా పోస్టర్లు చూసి జనం చర్చించుకుంటున్నారు. ”ప్రజలారా.. మేం మోసపోయాం, మీరు మోసపోకండి” ఇట్లు దుబ్బాక ప్రజలు అని కొన్ని పోస్టర్లు ‘ప్రజలారా.. మేం మోసపోయాం, మీరు మోసపోకండి’ ఇట్లు హుజూరాబాద్ ప్రజలు అంటూ మరి కొన్ని పోస్టర్లు చౌటుప్పల్ మున్సిపాలిటీ అంతటా వెలిశాయి. ఈఏడాది ఆగస్టు 14న మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్స్ వెలిశాయి. అందులో రాజగోపాల్ రెడ్డిని మునుగోడు నిన్ను క్షమించదు అని రాశారు. రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం.. 13 ఏళ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి అని రాసి ఉండటంతో కలకలం రేపుతున్నాయి. అయితే ఇవాళ రాజగోపాల్ రెడ్డికి అనుకూల పోస్టర్లు రావడంతో.. సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. అప్పుడలా ఇప్పుడిలా ఏంటని చర్చలు జరుగుతున్నాయి.
Street Dogs Poison: 18 వీధికుక్కల మృతి ఘటనపై కేసు.. చేబ్రోలు పోలీసుల దర్యాప్తు
తాజావార్తలు
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!