Komatireddy Venkat Reddy : సెప్టెంబర్ 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్
- రెండు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధత
- బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు అసెంబ్లీలో చర్చలో
- ఓటర్ల జాబితా విడుదలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు
- హైకోర్టు ఆదేశాల మధ్య గ్రామీణాభివృద్ధి నిధుల కోసం కీలకమైన ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy : తెలంగాణలో చాలా కాలంగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు చివరకు పచ్చజెండా ఊగబోతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే వారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తేల్చి చెప్పారు. సెప్టెంబర్ 10 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
మంత్రి కోమటిరెడ్డి వివరాల ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికలు రెండు విడతల్లో జరిగే అవకాశముంది. తొలి దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత రెండో విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సన్నాహాలు ఎన్నికల సంఘం వేగవంతం చేసింది. ప్రస్తుతం అసెంబ్లీలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల బిల్లుపై చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో ఆమోదం తర్వాత మండలిలో కూడా ఆ బిల్లుపై చర్చ జరగనుంది. ఆ తర్వాతే ఎన్నికల షెడ్యూల్ను ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి వారం రోజుల సమయం కోరింది.
Also Read
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ దిశగా అడుగులు వేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 10లోపు విడుదల చేయాలని నోటిఫికేషన్ ఇచ్చింది. సెప్టెంబర్ 4 లేదా 5న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. అనంతరం 6 లేదా 7న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై అభ్యంతరాలను స్వీకరిస్తారు. పరిశీలనల అనంతరం 8 లేదా 9న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. దీంతో సెప్టెంబర్ 10నాటికి ఎన్నికల ప్రక్రియ ఘనంగా ప్రారంభమవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
గత ఏడాదిన్నరగా రాష్ట్రంలో పాలక మండళ్లు లేకపోవడంతో గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ముఖ్యంగా 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులు విడుదల కాకపోవడంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయి. ఈ నిధులను తిరిగి పొందేందుకు కూడా ఎన్నికలు కీలకమని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణ హైకోర్టు కూడా సెప్టెంబర్ 30లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Nani : అది తలచుకుంటే నరకంలా అనిపిస్తోంది.. నాని షాకింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?