తెలంగాణ సర్కార్పై మరోసారి హైకోర్టు ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఇచ్చిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.. తాము ఇచ్చిన ఆదేశాలు పాటించలేదన్న కోర్టు.. కోవిడ్ చికిత్సల ధరలపై కొత్త జీవో ఇవ్వలేదని మండిపడింది.. తాము అడిగిన ఏ ఒక్క అంశానికి నివేదికలో సరైన సమాధానంలేదని వ్యాఖ్యానించింది.. ఇక, రేపు జరిగే విచారణకు.. హెల్త్ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డీజీపీ.. అందరూ హాజరుకావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.. మహారాష్ట్రలో 8 వేల మంది చిన్నారుకులు ఇన్పెక్షన్ వచ్చిదని గుర్తుచేసిన న్యాయస్థానం.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించింది. విచారణ సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సల ధరలు ఒకేళా ఉండాలన్న ఆదేశాలను అమలు చేశారని అని ప్రశ్నించింది. అలాగే ఎవరివైతే లెసెన్స్లు రద్దు చేశారో.. వారినుంచి కరోనా రోగులకు డబ్బులు తిరిగి ఇప్పించారా? అని ప్రశ్నించింది.. రేపటి విచారణకు హెల్త్ సెక్రటరీ, డీజీపీ సహా అందరూ హాజరుకావాలని ఆదేశించింది..
ఇక, థర్డ్ వేవ్కు ప్రభుత్వం ఎలా సన్నద్ధం అవుతోంది? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.. దీనిపై వివరాలు లేవా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ దశగా మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి? అని ప్రశ్నించింది.. నిలోఫర్లో 200 పడకలు ఏర్పాటు చేస్తే సరిపోతుందా? అని ప్రశ్నించింది.. అసలు, కోవిడ్ థర్డ్ వేవ్ కట్టడికి ఎలా సన్నద్ధం అవుతున్నారని నిలదీసింది.. మే 17న విచారణలో చాలా ప్రశ్నలు లేవనెత్తింది హైకోర్టు.. వాటిపై సమాధానాలు ఇవ్వాలని కోరింది. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స రేట్లను నిర్ణయిస్తూ కొత్త జీవో విడుదల చేయాలని కోరింది.. కానీ, జీవో విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. తాము ఇచ్చిన చాలా ఆదేశాలు పాటించలేదు.. కరోనాపై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించింది.
Also Read
తాజావార్తలు
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..