Pocharam Srinivas Reddy: ముగిసిన బీఏసీ సమావేశం.. 14 రోజుల పాటు శీతాకాల సమావేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
speaker pocharam srinivas reddy chaired the bac meeting: స్పీకర్ ఛాంబర్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో.. సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలు, పద్దులపై చర్చించారు. బీఏసీ సమావేశానికి సీఎం హాజరుకాలేదు. ప్రభుత్వం తరఫున మంత్రులు, చీఫ్విప్, కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్గ, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ..భేటీలో ఈ నెల 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. కాగా.. ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని కోరాయి. అయితే.. రోజురోజుకు సమావేశాలు నిర్వహించే రోజులు తగ్గుతున్నాయని కాంగ్రెస్, మజ్లిస్ పేర్కొన్నాయి. దీంతో.. పని దినాలు తగ్గినా, పని గంటలు ఎక్కువగా ఉంటున్నాయని, బిజినెస్ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నామని మంత్రులు పేర్కొన్నారు.
వినాయకనిమజ్జనంతో పాటుగా తెలంగాణ జాతీయ సమైక్య ఉత్సవాల దృష్ట్యా సమావేశాలు ఎక్కువ రోజులు సభను నిర్వహించలేకపోతున్నామని మంత్రులు పేర్కొన్నారు. అంతేకాకుండా.. అవసరమైతే శీతాకాల సమావేశాలను మరోసారి 14 రోజుల పాటు నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తామని మంత్రులు చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చర్చించాలని కాంగ్రెస్, మైనారిటీలు, హైదరాబాద్ సమస్యలపై చర్చించాలని ఎంఐఎం కోరింది. తెలంగాణ రాష్ట్రం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో పాటు వివిధ అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రులు పేర్కొన్నారు. ఈ..సమావేశాల్లో పలు బిల్లులతో పాటు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రులు తెలిపారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
ఇక గతంలో వాయిదాపడ్డ శాసనసభా సమావేశాలకు కొనసాగింపుగా, నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశం ప్రారంభమైన అనంతరం తుంగుర్తి మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం, కమలాపూర్ మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్దన్రెడ్డికి సభ సంతాపం ప్రకటించింది. ఇద్దరి మృతికి సంతాపం పాటిస్తూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీని వాయిదా వేశారు. అనంతరం శాసన మండలి సైతం సమావేశం కాగా, ఇటీవలి గోదావరి వరదలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పర్యటించినా ఒక్కపైసా సాయం చేయలేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు.
అయితే.. గవర్నర్ను అక్కడకు పంపి, ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వరదలు వచ్చినా.. వర్షాలు కురిసినా ఒక్కరూ చనిపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అయితే.. 35 సంవత్సరాల తర్వాత భారీ వర్షాలు కురిశాయని.. 135శాతం వర్షాపాతం నమోదైందన్నారు. ఇక కాళేశ్వరం పంపులు నీట మునిగిన మాట వాస్తవమేనన్న ఆయన, 2009లో శ్రీశైలంలో వరదలు వచ్చిన సమయంలో విద్యుత్ ప్రాజెక్టు మునిగిపోయిందన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇక వరదలు వచ్చిన సమయంలో కేంద్రం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Heavy Rains In Hyderabad: హైదరాబాద్ లో దంచికొట్టిన వాన.. ట్రాఫిక్ జామ్
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!