MLA Rajaiah: చివరి నిమిషంలో ఏమైనా జరగొచ్చు.. ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Rajaiah: జనగామ జిల్లా స్టేషన్ ఘనపు నియోజకవర్గం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందస్తుగా ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో మార్పులు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదని.. ఏమైనా జరగొచ్చని కడియం శ్రీహరికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల అసెంబ్లీకి పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్ కేటాయించలేదు. అక్కడ మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్. దీంతో అసంతృప్తితో ఉన్న రాజయ్య నియోజకవర్గంలోని కార్యకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మహిళా ఆత్మీయ సమావేశంలో రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని రాజయ్య పరోక్షంగా హెచ్చరించిన ఆయన ఇల్లు అలకగానే పండుగ కాదని అన్నారు. బిడ్డ పుట్టుక ముందే కుళ్ల కుట్టినట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తన మీద అబద్ధాలు ప్రచారాలు చేస్తే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరికలు జారీ చేశారు. కాగా.. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సుప్రీం బాస్ అని.. ఇది గుర్తు పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు.
Read also: Heavy Rain: తెలంగాణకు రెయిన్ అలెర్ట్.. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే ఛాన్స్
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చినా ఎమ్మెల్యే ద్వారానే రావాలన్నారు. జనవరి 17 వరకు తానే ఎమ్మెల్యేనని.. నియోజకవర్గానికి తానే బాస్ అని చెప్పారు. కొన్ని పథకాలను మూసివేస్తామని, భూదందాలు, బెదిరింపులు మొదలయ్యాయని, ఇది సరికాదన్నారు. అలాంటి వారి పట్ల బిఆర్ ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పదవులు కార్యకర్తలు ఇచ్చే భిక్ష అని.. కార్యకర్తలంటే నాయకులు భయపడాలన్నారు. పార్టీ కోసం ప్రాణత్యాగం చేశామని, సీఎం కేసీఆర్కు అండగా ఉన్నామన్నారు. 115 మంది అభ్యర్థులతో తుది జాబితా ప్రకటించలేదని కేసీఆర్ స్వయంగా చెప్పారని అన్నారు. మార్పులు చేర్పులు ఉంటాయని.. ఎన్నికల నాటికి ఏమైనా జరగవచ్చని అన్నారు. సీఎం కేసీఆర్ తనకు మరోసారి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు రాజయ్య వెల్లడించారు.
Bhadradri Kothagudem: అది బండి అనుకున్నావా బస్సు అనుకున్నావా.. స్కూటీపై 8 మందా!
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!