Bhadradri Kothagudem: అది బండి అనుకున్నావా బస్సు అనుకున్నావా.. స్కూటీపై 8 మందా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhadradri Kothagudem: ద్విచక్ర వాహనం అంటే.. ఒకరిద్దరు వెళ్లవచ్చు. చిన్న పిల్లలుంటే ఒకరిద్దరు బైక్పై ప్రయాణించవచ్చు. అది కూడా సైజు చిన్నగా ఉంటే ప్రయాణం సాగిపోతుంది. కొంతమంది అలా కాదు ట్రిపుల్ రైడింగ్ చేస్తారు. అయితే ముగ్గరు బైక్ పై ఉంటేనే ట్రాఫిక్ పోలీసులు కఠినంగా జరిమానా విధిస్తారు. అయితే కొందరు కుటుంబీకులు ముగ్గురు, నలుగురు పిల్లలను బైక్లపై ఎక్కించుకుని సాహస యాత్రలకు వెళుతున్నారు. అలాంటి వ్యక్తి.. ఏడుగురు పిల్లలను స్కూటీపై ఎక్కించుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఈ దృశ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటుచేసుకుంది.
అయితే ఓ యువకుడు తనకు స్కూటీ నడపటం బాగా వచ్చనుకున్నాడో లేకా.. పిల్లల ముందు హీరోయిజం చూపిద్దామనుకున్నాడో కానీ.. ఏడుగురు పిల్లలను బండి ఎక్కించుకుని రోడ్డు మీదికి వచ్చాడు. అంతే జనం కళ్లాంతా ఆ బైక్ మీదే పడ్డాయి.. అసలే ముగ్గురు లేదా నలుగురు వెళ్తుంటేనే విచిత్రంగా చూసే జనం.. ఇలా ఏకంగా ఎనిమిది మంది అందులోనూ ఏడుగురూ చిన్నారులే ఉండటంతో అందరి చూపు ఆ స్కూటివైపే మళ్లింది. ఒకరే ఇద్దరు అయితే ఏమైనా అనుకోవచ్చుగానీ.. ఒకేసారి అంతమందితో బైక్ నడుపుతుంటే స్థానికులందరూ బిత్తరపోయి చూసారు. ఆ ప్రబుద్ధుని విజ్ఞాన ప్రదర్శనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో.. ఇది కాస్తా వైరల్గా మారింది. ఏడుగురు పిల్లలను బండిపై ఎక్కించుకుని వెళుతుండగా అనుకోని ప్రమాదం జరిగితే ఏం జరుగుతుందని ఆ యువకుడిపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే మరికొందరిలో మార్పు వస్తుందని నెటిజన్లు అంటున్నారు. నమస్కారం సార్.. అది స్కూటీ కావాలా.. లేక సెవెన్ సీటర్ ఆటో కావాలా.. అవన్నీ ఎక్కించుకున్నావా అంటూ కమెంట్లు చేశారు. సెవెన్ సీటర్ ఆటోలో కూడా ఏడుగురు మాత్రమే కూర్చుంటారనీ, అయితే ఈ బుద్దిమంతుడు ఏడుగురు పిల్లలతో పాటు మొత్తం 8 మందితో స్కూటీపై ప్రమాదకరంగా ప్రయాణించాడని నెటిజన్లు మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి పోలీసులకు చేరింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆ ఎనిమిది మంది బైక్ ప్రయాణించిన దానిపై ఆరా తీసారు. ఆ బైక్ నడిపిన ప్రబుద్ధుడి పేరు కుమ్మరికుంట్ల నాగేశ్వరరావు అని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో అతడిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అందుకే ఓవర్ చేయాలి కానీ.. మితిమీరితే ఇదిగో ఇలానే ఉంటుంది.
Petrol Pump: 5వ అంతస్థులో పెట్రోల్ బంక్.. ఎలా వెళ్లాలి బాసూ
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!