Bhadradri Kothagudem: అది బండి అనుకున్నావా బస్సు అనుకున్నావా.. స్కూటీపై 8 మందా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhadradri Kothagudem: ద్విచక్ర వాహనం అంటే.. ఒకరిద్దరు వెళ్లవచ్చు. చిన్న పిల్లలుంటే ఒకరిద్దరు బైక్పై ప్రయాణించవచ్చు. అది కూడా సైజు చిన్నగా ఉంటే ప్రయాణం సాగిపోతుంది. కొంతమంది అలా కాదు ట్రిపుల్ రైడింగ్ చేస్తారు. అయితే ముగ్గరు బైక్ పై ఉంటేనే ట్రాఫిక్ పోలీసులు కఠినంగా జరిమానా విధిస్తారు. అయితే కొందరు కుటుంబీకులు ముగ్గురు, నలుగురు పిల్లలను బైక్లపై ఎక్కించుకుని సాహస యాత్రలకు వెళుతున్నారు. అలాంటి వ్యక్తి.. ఏడుగురు పిల్లలను స్కూటీపై ఎక్కించుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఈ దృశ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటుచేసుకుంది.
అయితే ఓ యువకుడు తనకు స్కూటీ నడపటం బాగా వచ్చనుకున్నాడో లేకా.. పిల్లల ముందు హీరోయిజం చూపిద్దామనుకున్నాడో కానీ.. ఏడుగురు పిల్లలను బండి ఎక్కించుకుని రోడ్డు మీదికి వచ్చాడు. అంతే జనం కళ్లాంతా ఆ బైక్ మీదే పడ్డాయి.. అసలే ముగ్గురు లేదా నలుగురు వెళ్తుంటేనే విచిత్రంగా చూసే జనం.. ఇలా ఏకంగా ఎనిమిది మంది అందులోనూ ఏడుగురూ చిన్నారులే ఉండటంతో అందరి చూపు ఆ స్కూటివైపే మళ్లింది. ఒకరే ఇద్దరు అయితే ఏమైనా అనుకోవచ్చుగానీ.. ఒకేసారి అంతమందితో బైక్ నడుపుతుంటే స్థానికులందరూ బిత్తరపోయి చూసారు. ఆ ప్రబుద్ధుని విజ్ఞాన ప్రదర్శనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో.. ఇది కాస్తా వైరల్గా మారింది. ఏడుగురు పిల్లలను బండిపై ఎక్కించుకుని వెళుతుండగా అనుకోని ప్రమాదం జరిగితే ఏం జరుగుతుందని ఆ యువకుడిపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే మరికొందరిలో మార్పు వస్తుందని నెటిజన్లు అంటున్నారు. నమస్కారం సార్.. అది స్కూటీ కావాలా.. లేక సెవెన్ సీటర్ ఆటో కావాలా.. అవన్నీ ఎక్కించుకున్నావా అంటూ కమెంట్లు చేశారు. సెవెన్ సీటర్ ఆటోలో కూడా ఏడుగురు మాత్రమే కూర్చుంటారనీ, అయితే ఈ బుద్దిమంతుడు ఏడుగురు పిల్లలతో పాటు మొత్తం 8 మందితో స్కూటీపై ప్రమాదకరంగా ప్రయాణించాడని నెటిజన్లు మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి పోలీసులకు చేరింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆ ఎనిమిది మంది బైక్ ప్రయాణించిన దానిపై ఆరా తీసారు. ఆ బైక్ నడిపిన ప్రబుద్ధుడి పేరు కుమ్మరికుంట్ల నాగేశ్వరరావు అని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో అతడిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అందుకే ఓవర్ చేయాలి కానీ.. మితిమీరితే ఇదిగో ఇలానే ఉంటుంది.
Petrol Pump: 5వ అంతస్థులో పెట్రోల్ బంక్.. ఎలా వెళ్లాలి బాసూ
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!