Asaduddin Owaisi: ఇరాన్పై ఇజ్రాయిల్ దాడి గురించి ప్రధాని మోడీకి ముందే తెలుసా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా యుద్ధంలోకి లాగబడ్డాయి. శనివారం ఉదయం యూఎస్ ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై దాడులు చేశాయి. సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇరాన్ కూడా తీవ్రంగానే స్పందించింది. ఖతార్, సౌదీ, యూఏఈలతో పాటు మిడిల్ ఈస్ట్లో ఉన్న యూఎస్ మిలిటరీ స్థావరాలపై క్షిపణుల్ని ప్రయోగించింది.
Also Read
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఇదిలా ఉంటే, ఈ యుద్ధంపై భారతదేశంలో రాజకీయం మొదలైంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై ఇజ్రాయిల్ దాడి చేయబోతున్నట్లు ప్రధాని నరేంద్రమోడీకి ముందే తెలుసా..? అని ప్రశ్నించారు. దాడికి ఒకరోజు ముందు ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పాటు ఇజ్రాయిల్లో పర్యటించారు. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఆ దేశ పార్లమెంట్ అయిన నెస్సెట్లో ప్రధాని మోడీ ప్రసంగించారు.
ఈ యుద్ధం గురించి ఓవైసీ మాట్లాడుతూ.. ‘‘ఇరాన్పై ఇజ్రాయిల్ దాడి చేస్తుందనే సమాచారం నెతన్యాహూ ముందుగా ప్రధానికి తెలియజేశారో లేదో దేశానికి చెప్పాలి. అలా చేసి ఉంటే ప్రధాని తన పర్యటనను ముగించి దేశానికి తిరిగి రావాలి. అమెరికా సహకారంతో ఇరాన్పై దాడి చేస్తున్న ఇజ్రాయిల్ మనకు తెలియజేయకుంటే ఇజ్రాయిల్ మనల్ని మోసం చేసినట్లే’’ అని ఓవైసీ అన్నారు. ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రధాని మోడీ విమానం గాల్లో ఉండీ, ఇలాంటి దాడులు జరిగితే ఎవరు బాధ్యత వహించే వారు.? అని ప్రశ్నించారు. నెతన్యాహూ యుద్ధ వివరాలను ప్రధాని మోడీకి చెప్పారో లేదో దేశానికి తెలియజేయాలి. ఇరాన్పై దాడి చేయడానికి, గాజాలో పాలస్తీనియన్ల ఊచకోతకు ప్రధాని పర్యటనను ఉపయోగించుకున్నారని అన్నారు. దీని వల్ల భారత్ ఇరాన్తో కాకుండా ఇజ్రాయిల్ తో ఉందని సందేశం వస్తుందని, ఈ దాడి వల్ల భారత్కు ఏం లాభం ఉందని ప్రశ్నించారు.
#WATCH | Hyderabad: On Iran-Israel conflict, AIMIM chief Asaduddin Owaisi says, "If the Prime Minister's aircraft was in the air and such an attack had taken place, who would have been responsible? The Prime Minister should tell the country whether Netanyahu had informed him that… pic.twitter.com/mE3Rl1KKuD
— ANI (@ANI) February 28, 2026
తాజావార్తలు
-
Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
-
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!