Puvvada Ajay Kumar: అధికారంలోకి రాక ముందే వారేంటో తెలిసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puvvada Ajay Kumar: కాంగ్రెస్ కు పవర్ ఇస్తే రైతులకు కరెంట్ కట్ అంటూ పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం మంచుకొండలో ధర్నాలో మంత్రి అజయ్ కుమార్ పాల్గొన్నారు. మూడు గంటల విద్యుత్ సరిపోతుంది అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై అజయ్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ నికు వ్యవసాయం గురించి ఏమి తెలుసు? అని ప్రశ్నించారు. గోడలకు సున్నాలు వేసిన రేవంత్ కు రైతుల బాధలు ఏమి తెలుసు? అని మండిపడ్డారు. వ్యవసాయానికి 24 కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. కాంగ్రెస్ కు పవర్ ఇస్తే రైతులకు కరెంట్ కట్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాక ముందే వాళ్ళ కడుపులో ఏమి వుందో స్పష్టం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కష్టాలు మనకు తెలుసు..కేసీఆర్ రాగానే ఎడు గంటలు, ఇప్పుడు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని గుర్తు చేశారు. తెలంగాణలోని అద్భుతమైన వ్యవసాయం సాగుతోందని అన్నారు. అప్పుడే రైతుల ముఖం తెల్లగా కనబడుతుందని తెలిపారు.
Read also: Hyderabad Bike Stunt: పోతావ్ ర రేయ్.. గర్ల్ప్రెండ్ వెనుక కూర్చుంటే ఇంత పైత్యం అవసరమా?
Also Read
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
గతంలో ఎరువుల లారీలు ఎలా లూటీలు అయ్యాయి? అని ప్రశ్నించారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదన్నారు. విత్తనాల కోసం రోడ్లమీద చెప్పులు పెట్టిన పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండేదని అన్నారు. గతంలో పిండి బస్తాలు విత్తనాల కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డాము మనకు తెలుసని అన్నారు. 24 గంటల కరెంటు రైతు బీమా రైతు బంధు ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వంలో ఇస్తున్నామన్నారు. కేసీఆర్ రైతు బాంధవుడు.. మన పిల్లలు మంచిగా చదువుకుంటున్నారంటే కేసీఆర్ మహిమ అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు ఇవ్వటం లేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాదు.. రేవంత్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పాతాళంలోకి దిగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి భూస్థాపితం చేస్తారన్నారు. రైతులు రేవంత్ రెడ్డిని తరిమితరిమి కొడతారని అన్నారు. చంద్రబాబు ఏజెంట్లు ఉత్తర నాయకులు పీసీసీ ప్రెసిడెంట్లుగా వున్నారని ఆరోపించారు. వారికి భవిష్యత్తు లేకుండా చేయాలని, కాంగ్రెస్ పార్టీ కుటిల నీతిని గ్రామాల్లో ఎండగట్టాలని పిలుపు నిచ్చారు.
Secret Camera: గదిలో రహస్యంగా కెమెరాలు.. యువతులు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు రికార్డ్
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
-
FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
-
R Ashwin: ముందుగానే చెప్పాలి కదా.. ఇప్పుడు చెప్తే ఎలా.. బీసీసీఐపై అశ్విన్ ఫైర్!
-
Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!