PM MODI: తెలంగాణలో ఒక కుటుంబం.. ప్రజల ఆకాంక్షల్ని కబ్జా చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఇందూరు ప్రజా గర్జన సభలో పాల్గొని ప్రసంగించారు. ముందుగా నా తెలంగాణ కుటుంబ సభ్యులారా అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రూ.8 వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టుకు శంకుస్థాపన తానే చేశానన్నారు. NTPC ప్లాంట్ వల్ల తెలంగాణకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా.. నిజామాబాద్ మహిళలు పెద్ద ఎత్తున వచ్చి తనకు స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Read Also: PM MODI: NDAలో చేరుతానని కేసీఆర్ నన్ను అడిగారు.. సీక్రెట్స్ బయటపెట్టిన ప్రధాని!
Also Read
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. INDIA కూటమి, కాంగ్రెస్.. మహిళా బిల్లు పాస్ కాకుండా కుట్రలు చేసేవారని ప్రధాని ఆరోపించారు. మహిళా బిల్లుకు మద్దతు అని బయటకు చెబుతూ, లోపల కుట్రలు చేసేవారని మండిపడ్డారు. దేశ మహిళలు ఇచ్చిన శక్తి వల్లే తాను మహిళా బిల్లును పాస్ చేయగలిగానని తెలిపారు. ఇక తెలంగాణను నిజాం నుంచి సర్దార్ పటేల్ విముక్తి కల్పించారని.. ఇప్పుడు మరో గుజరాతీ.. తెలంగాణ సమృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. మరోవైపు దేశ అభివృద్ధిలో తెలంగాణ తన సహకారం ఉందని.. తెలంగాణనే కరోనాకి వాక్సిన్ ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ కోసం కేంద్రం భారీగా నిధులు ఇస్తే.. బీఆర్ఎస్ వాటిని లూటీ చేసిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ లూటీస్వామ్యంగా మార్చేశారని ప్రధాని మండిపడ్డారు. తెలంగాణలో ఒక కుటుంబం.. ప్రజల ఆకాంక్షల్ని కబ్జా చేసిందని తెలిపారు. కుటుంబ పాలనతో అంతా తమ వారికే లబ్ధి కలిగేలా చూసుకుంటారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని ప్రధాని మోడీ అన్నారు.
- Tags
- bjp
- BRS Government
- kcr
- modi
- telugu news
తాజావార్తలు
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!