Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- రాజరాజేంద్ర చౌరస్తా వద్ద ముగ్గురు దుండగుల దాడి
- కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి
- వైష్ణవి హత్యకు ప్రతీకారమేనా?
- సీసీటీవీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad Murder: నిజామాబాద్ నగరంలో తీవ్ర సంచలనం రేపిన హత్య ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ప్రధాన కేంద్రమైన రాజరాజేంద్ర చౌరస్తా వద్ద కోరుట్ల పట్టణానికి చెందిన హరిబాబు అనే వ్యక్తిపై ముగ్గురు గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా దాడి చేసి హత్య చేశారు. గత మార్చి నెలలో తీవ్ర దుమారం రేపిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో హరిబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న నేపథ్యంలో ఈ దారుణం జరగడం కలకలం రేపింది.
ప్రేమ పెళ్లి.. ఎనిమిది నెలలకే భార్య హత్య
జగిత్యాల జిల్లా మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవిని హరిబాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో వారిని ఎదిరించి మాదాపూర్లోని అత్తవారింట్లోనే కాపురం పెట్టాడు. అయితే, ప్రేమించి పెళ్లి చేసుకున్న కేవలం ఎనిమిది నెలలకే మనస్పర్థలు రావడంతో భార్య వైష్ణవిని హరిబాబు దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన హరిబాబు, ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చాడు.
Also Read
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
కొబ్బరికాయలు కోసే కత్తితో దారుణ దాడి
రాజారాజేంద్ర చౌరస్తా వద్ద హరిబాబు వెళ్తుండగా ముగ్గురు దుండగులు ఆయనను అడ్డుకున్నారు. వెంట తెచ్చుకున్న కొబ్బరికాయలు కోసే కత్తితో నడిరోడ్డుపైనే హరిబాబుపై విచక్షణారహితంగా దాడి చేసి కత్తులతో పొడిచారు. తీవ్ర రక్తస్రావమైన హరిబాబు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) మార్చురీకి తరలించారు.
పాత కక్షలే కారణమా?.. దర్యాప్తు ముమ్మరం
బెయిల్పై బయటకు వచ్చిన హరిబాబును వైష్ణవి హత్యకు ప్రతికారంగానే లేదా పాత కక్షల నేపథ్యంలోనే హతమార్చారా అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. హత్య చేసి పరారైన ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సంఘటనా స్థలం పరిసరాల్లోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను ఆధారంగా చేసుకుని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!