PCC Chief Mahesh Goud: మళ్లీ అధికారం మాదే.. రాబోయే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలుస్తాం..
- మాది రైతు ప్రభుత్వం.. నిజామాబాద్లో రైతు మహోత్సవం నిర్వహిస్తున్నాం..
- బీఆర్ఎస్ రైతు వ్యతిరేక పార్టీ.. రైతుల గురించే మాట్లాడే అర్హత లేదని వెల్లడి..
- మళ్లీ అధికారం మాదే.. రాబోయే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలుస్తాం: మహేష్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PCC Chief Mahesh Goud: నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. మాది రైతు ప్రభుత్వం.. అందుకే నిజామాబాద్ లో రైతు మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించటమే రైతు మహోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం అని తేల్చి చెప్పారు. ఇక, నిజాం సాగర్, శ్రీరాం సాగర్ ప్రాజెక్టుల పూడికను తీయటానికి త్వరలో టెండర్లు పిలుస్తామని ఆయన వెల్లడించారు. అయితే, బీఆర్ఎస్ రైతుల వ్యతిరేక పార్టీ.. బీఆర్ఎస్ రైతులను నట్టేటా ముంచింది అని ఆరోపించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
Read Also: CM Chandrababu: అమిత్షాతో చంద్రబాబు కీలక చర్చలు..
Also Read
అయితే, నిజామాబాద్ జిల్లాలో కొత్త షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ తెలిపారు. 10 ఏళ్ళల్లో నిజామాబాద్ జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కేటీఆర్, కేసీఆర్ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇక, బీఆర్ఎస్ పని అయిపోయింది.. మళ్ళీ మాదే అధికారం, రాబోయే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు.. ఇన్ డైరెక్ట్ గా బీజేపీకి మద్దతిచ్చి బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుంది అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ అనేది ఉండదని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?