N. Ramachandra Rao: తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఇప్పుడు భాగ్యలక్ష్మీ ఆలయం, చార్మినార్ వివాదాలు నడుస్తున్నాయి. స్థానిక కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ చార్మినార్ వద్ద నమాజ్ చేయడానికి సంతకాల సేకరణ ప్రారంభించడంతో వివాదం రాజుకుంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా ఈ అంశంపై మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత రామచంద్రరావు ఫైర్ అయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు రామచంద్ర రావు. కాంగ్రెస్ పార్టీ హిందూ, ముస్లింలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. భాగ్యలక్ష్మీ ఆలయంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డ్రామానే ఇందుకు నిదర్శనం అని ఆరోపించారు. పాత బస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం విషయంలో కాంగ్రెస్ పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని.. ఒకవైపు భాగ్యలక్ష్మీ ఆలయం అక్రమ కట్టడం అని పేర్కొంటూ మైనారిటీ మోర్చా నాయకులు అక్కడే నమాజ్ చేస్తామంటూ సంతకాలు సేకరణ చేపడుతున్నారని.. ఇంకో వైపు కాంగ్రెస్ నేతలు అమ్మవారి ఆలయంలో పూజుల నిర్వహిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
కాంగ్రెస్ పార్టీ నేతలు రెండు నాల్కల ధోరణికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని రామచంద్రారావు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని.. ఆ పార్టీ హైదరాబాద్ లో పూర్తిగా పట్టుకోల్పోయిందని అన్నారు. మైనారిటీల ఓటు బ్యాంకు కోసం సంతకాల సేకరణ పేరుతో ముస్లింలను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఇంకో వైపు భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద పూజల పేరిట హిందువులను రెచ్చగొట్టే చర్యలకు పూనుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలంతా ఇదంతా గమనిస్తున్నారని.. కాంగ్రెస్ నేతలు ఇకనైనా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలతో పబ్బం గడుపుకునే పనులు మానుకోవాలని హితవు పలికారు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?