N. Ramachandra Rao: తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఇప్పుడు భాగ్యలక్ష్మీ ఆలయం, చార్మినార్ వివాదాలు నడుస్తున్నాయి. స్థానిక కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ చార్మినార్ వద్ద నమాజ్ చేయడానికి సంతకాల సేకరణ ప్రారంభించడంతో వివాదం రాజుకుంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా ఈ అంశంపై మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత రామచంద్రరావు ఫైర్ అయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు రామచంద్ర రావు. కాంగ్రెస్ పార్టీ హిందూ, ముస్లింలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. భాగ్యలక్ష్మీ ఆలయంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డ్రామానే ఇందుకు నిదర్శనం అని ఆరోపించారు. పాత బస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం విషయంలో కాంగ్రెస్ పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని.. ఒకవైపు భాగ్యలక్ష్మీ ఆలయం అక్రమ కట్టడం అని పేర్కొంటూ మైనారిటీ మోర్చా నాయకులు అక్కడే నమాజ్ చేస్తామంటూ సంతకాలు సేకరణ చేపడుతున్నారని.. ఇంకో వైపు కాంగ్రెస్ నేతలు అమ్మవారి ఆలయంలో పూజుల నిర్వహిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
కాంగ్రెస్ పార్టీ నేతలు రెండు నాల్కల ధోరణికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని రామచంద్రారావు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని.. ఆ పార్టీ హైదరాబాద్ లో పూర్తిగా పట్టుకోల్పోయిందని అన్నారు. మైనారిటీల ఓటు బ్యాంకు కోసం సంతకాల సేకరణ పేరుతో ముస్లింలను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఇంకో వైపు భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద పూజల పేరిట హిందువులను రెచ్చగొట్టే చర్యలకు పూనుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలంతా ఇదంతా గమనిస్తున్నారని.. కాంగ్రెస్ నేతలు ఇకనైనా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలతో పబ్బం గడుపుకునే పనులు మానుకోవాలని హితవు పలికారు.
తాజావార్తలు
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!