Munugode bypolls: మునుగోడులో భారీగా నామినేషన్లు.. ఒక్కరోజే వందకుపైగా నామినేషన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉపఎన్నిక ప్రక్రియలో నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. చండూరులోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి… శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతోపాటు మొత్తం వంద మందికిపైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజున వందకుపైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో ఎక్కువగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. 141 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. శని, ఆదివారాల్లో నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.
Read Also: Fact Check: అవునా? 4 జీ, 3 జీ మొబైల్స్ నిలిచిపోతాయా? నిజమెంత..?
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా మునుగోడు ఉపఎన్నికను భావిస్తున్న పార్టీలు… ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పోటీకి నిలిచారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బరిలో దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చివరి రోజున నామినేషన్ వేశారు. చర్లగూడెం ప్రాజెక్టు భూనిర్వాసితులు 8 మంది నామినేషన్లు వేశారు. 317 జీవోకు సంబంధించిన బాధితులు ఇద్దరు నామినేషన్లు వేశారు. ప్రజా శాంతి పార్టీ తరపున కేఏ పాల్, తెలంగాణ జన సమితి పార్టీ తరపున పల్లె వినయ కుమార్ గౌడ్లు నామినేషన్లు వేశారు. 2018 ఎన్నికల సమయంలో మునుగోడులో మొత్తం 33 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అప్పుడు చివరగా 15 మంది మాత్రమే బరిలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఉపఎన్నిక కావడంతో నామినేషన్లు పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి. ఈనెల 17న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ఉంది. దీంతో అప్పటివరకు వీరిలో ఎంతమంది పోటీ నుంచి తప్పుకుంటారు? ఆ తర్వాత ఎంతమంది బరిలో ఉంటారన్నది తేలాల్సి ఉంది. ఇక వచ్చేనెల 3న ఉపఎన్నిక పోలింగ్, 6న కౌంటింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్లో రో-కో ఆడతారా?
-
Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
-
Ram Charan : RC17 పై ‘పెద్ది’ ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
-
Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
-
Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు… ‘దేశభక్తి’ టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!