MLC Kavitha: తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha Says Other States Copying Telangana Schemes: తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగనీటి దినోత్సవాల్లో ఆమె మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలపై కాంగ్రేస్ పార్టీ తప్పుడు ప్రచారం చేయడం ఏమాత్రం సరైంది కాదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకే.. కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. చెరువుల పండగతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని, తెలంగాణ సంస్కృతిని చాటి చెప్తున్నాయని అన్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సొంతూరులో పింఛన్ ఇవ్వడానికి ఆలోచించేవారని దుయ్యబట్టారు. వడ్డించేవాళ్ళు మన వాళ్ళు ఉండటం వల్లే.. సంక్షేమ పథకాలు అమలు, ప్రతి ఇంటికి చేరుతున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులు కేవలం లొల్లి పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Minister Kottu Satyanarayana: పవన్పై మంత్రి కొట్టు సంచలన వ్యాఖ్యలు.. కాపుల భావన అదే.!
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
నిజామాబాద్ ప్రజలు కేవలం కేసీఆర్ కటౌట్ చూసి ఓటు వేశారని, ఆయన ఖ్యాతి ఎవరెస్ట్ అంటూ ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. పదేళ్లలో సాధించిన ప్రగతిని సమీక్ష చేయడం కోసమే.. ఈ దశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చేసిన అభివృద్ధిని చెప్పే సత్తా కేసీఆర్కి మాత్రమే ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో, సమైక్య పాలనలో కరువు ఉండేదని.. కానీ ఇప్పుడు ఎక్కడా చూసినా పచ్చని పైర్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ అంటే కాలువలు, చెక్ డ్యామ్లు, రిజర్వాయర్లు అని అభివర్ణించిన ఆమె.. అతి తక్కువ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వల్ల, కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని కాకుండా కాళేశ్వరం చంద్రశేఖర రావు అని పిలవాలి కోరారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో కాలువలు కట్టకుండానే వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. బీజేపీ కూడా చేసిందేమీ లేదని విరుచుకుపడిన ఎమ్మెల్సీ కవిత.. నిజమైన దేశ భక్తుడు ఎవరైనా ఉన్నారంటే, అది కేవలం కేసీఆర్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.
Swimming Pool Death: యువకుడ్ని మింగేసిన స్విమ్మింగ్పూల్.. కారణమదే!
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!