MLA Raja Singh: బీఆర్ఎస్ ఎలక్షన్ స్టంట్ చేస్తోంది.. ఆ సర్కార్ మాయలో పడొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Raja Singh Comments On BC Corporation New GO Bill: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ కార్పొరేషన్ నుంచి ఒక జీవో వచ్చిందని.. కుల వృత్తుల వారికి రూ.1 లక్ష లోన్ ఇస్తామంటూ బీఆర్ఎస్ ఈ జీవోని తీసుకొచ్చిందని అన్నారు. అయితే.. బీసీలో 41 కేటగిరీలకు మాత్రమే లోన్ ఇస్తామని వారు చెప్పారని తెలిపారు. బీసీలో మొత్తం 130 కేటగిరీలున్నాయని.. మరి వారి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. మిగిలిన కేటగిరీలో పేదవారు లేరా? అని నిలదీశారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో.. బీఆర్ఎస్ ఎలక్షన్ స్టంట్ చేస్తోందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ కూడా ఇలాగే చేసేదని గుర్తు చేశారు.
Harish Rao: పక్క రాష్ట్రాలు, దేశాలకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నట్టు రూ.1 లక్ష ఇస్తారనే గ్యారెంటీ లేదని.. కచ్ఛితంగా లోన్ వంద శాతం ఇవ్వరని.. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అప్పులకుప్పగా మారిపోయిందని రాజాసింగ్ పేర్కొన్నారు. కాంట్రాక్టర్లకు, వర్కర్లకు కూడా డబ్బులు అందని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. కమిటీ హాళ్లు ఇస్తామని కొందరు తన నియోజకవర్గంలో తిరుగుతున్నారని వెల్లడించారు. బీఆర్ఎస్ వాళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని జీరో చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలారా? లోన్లు ఇస్తామని చెబుతున్న బీఆర్ఎస్ సర్కార్ మాయలో పడకండని సూచించారు. ఇప్పటికే తెలంగాణ అప్పులపాలయ్యిందని చెప్పిన ఆయన.. ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, తెలంగాణనే అమ్మేస్తారని ఆరోపణలు చేశారు.
Adipurush: కీలక నిర్ణయం.. వారికి ‘ఆదిపురుష్’ టికెట్స్ ఉచితం
బీఆర్ఎస్కు ఓటు వేస్తే.. మీరే నష్టపోతారని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. లోన్లు ఇస్తామని కొత్త జీవోని తెరపైకి తీసుకొచ్చారని, ఇది కేవలం షోపుటప్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఒక సామాజిక వర్గానికి రూ.10 లక్షలు అందిస్తున్నారని.. మరి మిగతా వారికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆ రూ.10 లక్షలు కేసీఆర్ తన జేబులో నుంచి ఇవ్వట్లేదని.. ప్రజలు కట్టే పన్నులనే తిరిగి ఇస్తున్నారని అన్నారు. అది పార్టీ ఫండ్ ఏమీ కాదన్నారు. అన్ని సామాజిక వర్గాలకు రూ.5 లక్షల లోన్ ఇవ్వాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!