Harish Rao: పక్క రాష్ట్రాలు, దేశాలకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Harish Rao Speech In Siddhipet Public Meeting: తెలంగాణ రాష్ట్రం.. పక్క రాష్ట్రాలు, దేశాలకు అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దేశంలో ఎక్కువగా వరి పండిస్తున్న రాష్ట్రం.. తెలంగాణ రాష్ట్రమేనని చెప్పారు. సిద్దిపేటలో నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు కోసం ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. కరువు పాటలు పాడుకున్న ఈ నేలలో ఇప్పుడు కాళేశ్వరం జలాలు పారుతున్నాయని అన్నారు. దేశంలో భూగర్భ జలాలు పడిపోతుంటే.. తెలంగాణలో ఏడున్నర మీటర్ల భూగర్భ జలాలు పైకి వచ్చాయని చెప్పారు. బతకబోయిన పాలమూరుకు బతకడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారన్నారు. సిద్దిపేట నుంచి త్వరలోనే తిరుపతికి, బెంగళూరుకి ట్రైన్ సదుపాయం వస్తుందన్నారు. అంతేకాదు.. సిద్దిపేటలో త్వరలోనే ఆర్టిఫిషియల్ బీచ్ కూడా నిర్మిస్తామన్నారు.
TDP and BJP: ఏపీలో మారుతున్న బీజేపీ నేతల స్వరం.. గతంలో విమర్శలు, నేడు కూల్ కామెంట్స్
Also Read
- N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
- TPCC: సీఎం రేవంత్రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
- Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్తో తానూ ఆత్మహత్య
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
అంతకుముందు.. మునిపల్లి మండలం చిన్న చల్మెడ శివారులో సంగమేశ్వర ఎత్తిపోతల పంపు హౌజ్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ చేతుల్లో ఉంటేనే బాగుంటుందని.. వేరే వాళ్ళ చేతికి పోతే ఆగం అవుతుందని అన్నారు. పేదలు, రైతులు సంక్షేమమే ఎజెండాగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. సంగమేశ్వర పథకానికి భూములిచ్చిన రైతుల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే.. సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం అవుతుందని, రెండేళ్లలో ఈ పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని కోనసీమగా మారుస్తామని మాటిచ్చారు. తెలంగాణ రావడం, కేసీఆర్ సీఎం కావడం వల్లే ఈ ప్రాజెక్టు వచ్చిందన్నారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇవ్వడంతో పాటు జహీరాబాద్, నారాయణఖేడ్ ఆసుపత్రులను అభివృద్ధి చేశామన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా అందిస్తున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
Lava Virat V1 Pro 5G: లావా విరాట్ V1 ప్రో 5G రిలీజ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్లు ఇవే
-
Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
-
Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
-
Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
-
Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!