Thalasani Srinivas Yadav: ప్రభాకర్ రెడ్డి వెనుక సీఎం ఉన్నారు.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల వెనుక ఎవరు ఉన్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thalasani Srinivas Yadav: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరు ఊపందుకున్నాయి. పార్టీలన్నీ మునుగోడులో తమ సత్తా చాటుకునేందుకు బాహాబాహీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో.. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం ఉప్పరిగూడెంలో మంత్రి తలసాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడులో అభివృద్ధి జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ నేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు.. కానీ, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల వెనుక ఎవరు ఉన్నారని? ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారో బీజేపీ నాయకులు చెప్పడం లేదని, రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం విమర్శలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.
Read also:Maharashtra Political Crisis: 22 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి..! సీఎం ఏక్నాథ్ షిండేకు ఎసరు…?
Also Read
- KBR Park One Way: కేబీఆర్ పార్క్ చుట్టూ అమల్లోకి వచ్చిన వన్ వే.. ప్రధాన రూట్స్ ఇవే..
- Tractor Cage Wheel: ట్రాక్టర్ కేజీవీల్స్ సమాచారం అందించండి.. రూ.5 వేలు పొందండి..
- One Ticket: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన TGSRTC.. ఒక్క టికెట్పైనే ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్లల్లో ప్రయాణం..
- Special Incentive: ప్రభుత్వ వైద్యులకు బంపర్ ఆఫర్.. మెరుగైన సేవలు అందిస్తే ప్రత్యేక ఇన్సెంటివ్లు..
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. అయితే.. అన్ని గ్రామాల్లోనూ తమ పార్టీకి కార్యకర్తలు బలంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఉప్పరిగూడెం గ్రామానికి రాక దాదాపు మూడున్నర సంవత్సరాలు అవుతోందన్నారు. ఇక, బీజేపీ నాయకులు ప్రచారం కోసం తిరుగుతుంటే ప్రజలు వారిని అడ్డుకుంటున్నారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఇక.. ప్రస్తుతం బరిలో 47 మంది ఉన్నారు. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుండగా, 6న ఫలితాలు వెలువడనున్నాయి.
Diwali Gold Sales: పండుగ చేసుకుంటున్న బంగారం వ్యాపారులు
తాజావార్తలు
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
-
Anasuya Bharadwaj: మరో వివాదంలో నటి అనసూయ.. ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై కేసు నమోదు ..
-
NC25 : వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని హీరో మైల్స్టోన్ మూవీ?
-
AP Assembly: నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్తో ప్రారంభం కానున్న శాసనసభ!
ట్రెండింగ్
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!