Maharashtra Political Crisis: 22 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి..! సీఎం ఏక్నాథ్ షిండేకు ఎసరు…?
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటాయి.. ఎప్పుడు ఎవరు సీఎం అవుతారో..? ఎప్పుడు ఎవరు తిరుగుబాటు చేస్తారో..? ఏ పార్టీ ఎమ్మెల్యే సీఎం అవుతారో కూడా చెప్పడం కొన్నిసార్లు కష్టమే.. మహా రాజకీయాలపై ఓ కథనం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది.. బీజేపీతో చేతులు కలిపిన శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. అప్పటి సీఎం ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసి సఫలం అయ్యారు.. ఆ తర్వాత బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి పీఠాన్నా ఎక్కారు.. అయితే, ఇప్పుడు ఏక్నాథ్ షిండే సీటుకు ఎసరు వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో అసంతృప్తి నెలకొంది.. ఆయన వర్గానికి చెందిన 40 ఎమ్మెల్యేల్లో 22 మంది మరో పార్టీలోకి జంప్ అవుతారంటూ.. ఉద్ధవ్ థాక్రే వర్గం ఆధ్వర్యంలోని శివసేన అధికారిక పత్రిక సామ్నా పేర్కొంది..
Read also: Betting Mafia attack: రెచ్చిపోయిన క్రికెట్ బెట్టింగ్ మాఫియా.. డబ్బులు ఇవ్వలేదని ఇంట్లోకి చొరబడి..!
Also Read
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
- The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
తాత్కాలిక ఒప్పందంలో భాగంగానే ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారని తన ఎడిటోరియల్లో రాసుకొచ్చిన సామ్నా… ఇక, తొందరలోనే షిండే యూనిఫాం వదిలేయాల్సి ఉంటుందని పేర్కొంది.. ఏ క్షణంలోనైనా ఏక్నాథ్ షిండే ఆయన ముఖ్యమంత్రి యూనిఫాం తొలగించే అవకాశం ఉందని అర్థమైపోయింది.. అంధేరి ఈస్ట్ ఉపఎన్నికల్లో షిండే వర్గం తన అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉన్నా.. బీజేపీ దానిని అడ్డుకుందని రాసుకొచ్చింది.. అంతేకాదు.. ఈ మధ్యే జరిగిన గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికల్లో విజయంపై వారు చెప్పేదంతా ఫేక్ అని కొట్టిపారేసింది.. వాస్తవం ఏంటంటే.. షిండే వర్గంలోని దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. వారు ఏ క్షణంలోనైనా తిరుగుబాటు చేయొచ్చు.. వారిలో చాలా మంది ఏక్షణమైనా బీజేపీలో చేరే అవకాశం ఉందని పేర్కొంది.. బీజేపీ తన ప్రయోజనాల కోసం షిండేని వాడుకుంటుందని.. కనీసం నిర్ణయాలు కూడా ఆయన చేతిలో లేవు.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నిర్ణయం తీసుకుంటే.. షిండే మాత్రం వాటిని ప్రకటిస్తారని ఆరోపించింది. అంటే సామ్నా కథనం ప్రకారం.. థాక్రేపై తిరుగుబాటు చేయించి.. ఏక్నాథ్ షిండేను తాత్కాలికంగా సీఎం చైర్లో కూర్చోబెట్టినా.. త్వరలోనే అతడిపై ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించి.. అధికారాన్ని పూర్తిస్థాయిలో బీజేపీ చేజిక్కించుకుంటుందనే అనుమానాలు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
-
Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
-
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
-
Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో