Congress: భట్టికి ఠాగూర్ ఫోన్.. సోనియా, రాహుల్ అభినందనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎల్సీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తన పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత మళ్లీ పాదయాత్ర తిరిగి ప్రారంభించారు.. పాదయాత్రలో ఉన్న ఆయన.. ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీతో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక భేటీకి కూడా వెళ్లలేదు.. దీనిపై ముందుగానే అధిష్టానానికి సమాచారం ఇచ్చారు.. మరోవైపు.. పాదయాల్రలో ఉన్న సీఎల్పీ నేత భట్టికి ఫోన్ చేశారు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. ఈ సందర్భంగా … సోనియా, రాహుల్ అభినందించారని వెల్లడించారు.. భట్టి చేస్తున్న పాదయాత్రకు ఏఐసీసీ సంపూర్ణ సహకారం ఉంటుందని వెల్లడించారు..
Read Also: Vijayashanti: సంస్కృతి కాపాడే బాధ్యత మోడీ తీసుకున్నారు..
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
ప్రజా సమస్యల పరిష్కారంకై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తుందన్న విషయాన్ని తెలుసుకున్న ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. హర్షం వ్యక్తం చేశారని ఠాగూర్ తెలిపారు.. భట్టి విక్రమార్క ఫోన్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పాదయాత్ర మధిర నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని భట్టి విక్రమార్క చేసే పాదయాత్రకు అధిష్టానం నుంచి సంపూర్ణమైన మద్దతు ఉంటుందని వారు తెలిపారని ఫోన్ లో చెప్పారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలం రేపల్లెవాడలో పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న సమయంలో ఠాగూర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇదే క్రమంలో ఫోన్ ద్వారా గ్రామ ప్రజలకు మాణిక్యం ఠాగూర్, రాహుల్ గాంధీ పంపిన సందేశాన్ని వివరించారు. మోడీ సర్కార్ డీజిల్ పెట్రోల్ గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర గురించి అధినేత రాహుల్ గాంధీ తెలుసుకొని అభినందించారని వెల్లడించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో తెలంగాణలో 2023 లో కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నదన్నారు.. రానున్న రోజుల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటం ఉధృతం చేయాలన్నారు. భట్టి విక్రమార్క మాకు అత్యంత మిత్రుడని తన అనుబంధాన్ని ఈసందర్భంగా గుర్తు చేశారు.
భట్టితో కలిసి నడుస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఠాగూర్.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!