Madhu Yaskhi : కాళేశ్వరం కుంభకోణం: కవిత, కేసీఆర్పై యాష్కీ సంచలన ఆరోపణలు
- మధు యాష్కీ కాళేశ్వరం కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు
- "కవిత, జైలు నుంచి వచ్చి బలహీన వర్గాల గురించి మాట్లాడటం విడ్డూరం"
- ఎమ్పీగా ఉన్నప్పుడు డబ్బులు వసూలు చేసినదని ఆరోపణ
- కేంద్రం సీబీఐ విచారణ ఆలస్యం చేస్తోందని యాష్కీ విమర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhu Yaskhi : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబానికి ‘ఏటీఎం’గా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారని గుర్తుచేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించినా ఇప్పటికీ అది ప్రారంభం కాలేదని ఆయన ఆరోపించారు.
“ప్రతిపక్ష పార్టీలు ఉన్న చోట సీబీఐ, ఈడీలు వచ్చేవి. కానీ ఇక్కడ కేసీఆర్పై అసెంబ్లీలో విచారణకు ఆదేశించినా కేంద్రం ఎందుకు ముందుకు రావడం లేదు?” అని మధు యాష్కీ ప్రశ్నించారు. దీంతో బీజేపీ-బీఆర్ఎస్ మైత్రి బయటపడిందని ఆయన వ్యాఖ్యానించారు. తొమ్మిదేళ్ల తర్వాత కవితకు కాళేశ్వరం గుర్తుకు వచ్చిందని, జైలుకు పోయి వచ్చిన ఆమె నీతులు చెప్పడం, అవినీతిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
Also Read
CAG Report: 10 ఏళ్లలో భారీగా పెరిగిన రాష్ట్రాల అప్పులు.. మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉందంటే..?
“పదేళ్లు బడుగులను దోచిన కవిత… ఇప్పుడు బీసీల గురించి మాట్లాడటం ఏంటి?” అని యాష్కీ ప్రశ్నించారు. కవిత వ్యవహారం చూస్తుంటే కేసీఆర్ రచించిన నాటకం నుండి బయటకు వస్తున్నట్టు ఉందని, కేసీఆర్ రచించిన ‘కవిత’లో కవిత ఓ భాగమని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్గానే ఉంటారని, తప్పితే వెనకాల ఉండి చేయడం ఆయనకు అలవాటు లేదని చెప్పారు. కవిత వెనకాల సీఎం ఉన్నాడనేది చవకబారు ప్రచారమేనని ధ్వజమెత్తారు.
స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్కు అనుకూలంగానే ఉంటాయని యాష్కీ ధీమా వ్యక్తం చేశారు. “స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతే ఏం చెప్పాలి అనే దానికోసం కేసీఆర్ కుటుంబం డ్రామా చేస్తుందా?” అని ప్రశ్నించారు. కవితపై నేరుగా ఆరోపణలు చేస్తూ, హిమాయత్నగర్లో ఉన్న విమలక్క ఆఫీస్ను ఖాళీ చేయించిందని, ఎక్కడా రెంట్ ఇవ్వకుండా చేసిందని ఆరోపించారు. కవితకు పోటీగా బతుకమ్మ పెట్టిందని కక్ష సాధించిందని, అలాంటి కవిత ఇప్పుడు బలహీన వర్గాల గురించి మాట్లాడుతుందని విమర్శించారు.
ఎంపీగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో డబ్బులు దండుకున్నదని, 10 మందికి శిక్షణ ఇచ్చి 100 మంది డబ్బులు దోచుకుందని యాష్కీ ఆరోపించారు. రైతుల కుటుంబాలను ఆదుకుంటాం అని డబ్బులు వసూలు చేసి వెనకేసుకుందని, హీరో నాగార్జున లాంటి వాళ్ల నుండి కూడా డబ్బులు వసూలు చేసి రైతులకు ఇస్తా అన్నదని చెప్పారు.
భవిష్యత్ రాజకీయాలపై మాట్లాడుతూ… ఎన్డీఏ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాదని యాష్కీ అంచనా వేశారు. కాంగ్రెస్ను అడ్డుకోవడం కోసం కేసీఆర్ను రక్షించే కుట్రను బీజేపీ చేస్తుందని, అందుకే సీబీఐ విచారణను ఆలస్యం చేస్తుందని ఆరోపించారు. “విచారణ చేసి కూడా కేసీఆర్ నిర్దోషి అని చెప్పే ప్రయత్నం కూడా జరగొచ్చు” అని ఆయన హెచ్చరించారు. కేటీఆర్పై కూడా విమర్శలు గుప్పించిన యాష్కీ.. “కేటీఆర్… సీఎం రమేష్ను కలవలేదు అని చెప్పలేదు. చర్చ చేయలేదు అని కూడా చెప్పడం లేదు” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ నుండి ఇంకా స్పందన రావాల్సి ఉంది.
Kanthara-1 : రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా కాంతార-1 ట్రైలర్..
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!