Jagga Reddy : రాహుల్ గాంధీ యాత్రపై బీజేపీ గుండాల దాడిని ఖండిస్తున్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ యాత్రను అస్సాం లో బీజేపీ నాయకులు(గుండాలు ) అడ్డుకొని దాడి కి ప్రయత్నించడం దారుణమన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ యాత్ర పై బీజేపీ గుండాల దాడిని ఖండిస్తున్నానన్నారు. రాహుల్ గాంధీ గారు దేశంలో జరుగుతున్న పరిణామల పై న్యాయం జరుగలని అలాగే న్యాయ యాత్ర చేస్తున్నారని, అలాగే దేశంలో ద్వేషాలు కాదు ప్రేమ పెంపొందించాలని యాత్ర చేస్తుంటే బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గు చేటన్నారు జగ్గారెడ్డి. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి జరుగడం మంచిది కాదని, రాహుల్ గాంధీ గారు చేస్తున్న యాత్ర తో ప్రజల్లో మార్పు వస్తుందని బయపడి బీజేపీ నాయకులు ఇలా దాడులు చేస్తున్నారన్నారు. దేశంలో బీజేపీ ప్రజలకు అందుబాటులో లేకుండా పరిపాలన చేస్తుందని, దేశంలో న్యాయం కరువైపోయిందని రాహుల్ గాంధీ గారు న్యాయం కోసం యాత్ర చేస్తున్నారన్నారు.
అంతేకాకుండా.. ‘రాహుల్ గాంధీ గారు గతంలో కూడా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసిన విషయం అందరికి తెలిసిందే. దేశంలో ప్రజలందరూ అన్నదమ్ములుగా కలిసి ప్రేమ తో ఉండాలని చేశారు. అన్ని కులాలలు, మతాలు ఒక్కటేనాని ప్రేమ తో బ్రతకాలని భారత్ జోడో యాత్ర చేశారు. ఎందుకంటే ఇటీవాలే దేశంలో పెరుగుతున్న హింస చూస్తున్నాము. మణిపూర్ లో రెండు వర్గాల మధ్య జరిగిన హింస ఘటన పై కూడా రాహుల్ గాంధీ గారు ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం వైఫల్యాల పై మాట్లాడారు. దేశం లో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యలను ఎండగట్టాలని ప్రజలను మేలుకొల్పలని రాహుల్ గాంధీ గారు న్యాయ యాత్ర చేస్తున్నారు. దేశంలో ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండాలని ప్రజల్లో ఒక మనోధైర్యం నింపడానికి రాహుల్ గాంధీ గారు యాత్ర చేస్తుంటే ఇలా బీజేపీ
నాయకులు దౌర్జన్యంగా అడ్డుకుంటారా. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ యాత్ర చేస్తుంటే ఇది సహించలేక బీజేపీ నాయకులు దాడి చేస్తున్నారు. బీజేపీ నాయకులు ఇలాంటి పద్ధతులు మానుకోవాలి. అస్సాం లో బీజేపీ నాయకులు ప్రవర్తించిన తీరు సరికాదు దీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.’ అని అన్నారు జగ్గారెడ్డి.
Also Read
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Shamshabad: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
తాజావార్తలు
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్బ్యాగ్స్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!